ETV Bharat / bharat

బంగ్లా​ జైల్లో 11ఏళ్లు.. ఇంటికొచ్చాక ఉప్పొంగిన తల్లి కన్నీళ్లు!

ఇన్నాళ్లకు అతడి అజ్ఞాతవాసం ముగిసింది. ఆ భారతీయుడు 11 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్​ జైలు నుంచి విడుదలయ్యాడు. ఎట్టకేలకు ఇంటికి చేరాడు. అసలు అతడు పక్క దేశానికి ఎందుకు వెళ్లాడు? ఎలా ఖైదీగా మారాడు?

author img

By

Published : Sep 15, 2019, 6:42 PM IST

Updated : Sep 30, 2019, 5:52 PM IST

బంగ్లా​ జైల్లో 11ఏళ్లు.. ఇంటికొచ్చాక ఉప్పొంగిన తల్లి కన్నీళ్లు!
బంగ్లా​ జైల్లో 11ఏళ్లు.. ఇంటికొచ్చాక ఉప్పొంగిన తల్లి కన్నీళ్లు!
11 ఏళ్లు బంగ్లాదేశ్​ జైల్లో గడిపిన సతీష్​ ఎట్టకేలకు ఓ సామాజికవేత్త చొరవతో ఇంటికి చేరాడు.

బిహార్ దర్భంగ జిల్లాకు చెందిన సతీష్ 2008లో​ వైద్యం చేయించుకునేందుకు రాజధాని పట్నాకు వెళ్లాడు. కానీ, ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు బంధువులు అతని కోసం గాలించారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. ఏళ్లు గడిచినా సతీష్​ ఆచూకీ దొరకలేదు.

2012లో అతని బంధువు ఒకరికి సతీష్​ బంగ్లాదేశ్​ జైల్లో ఉన్నాడన్న విషయం తెలిసింది. కుటుంబసభ్యులు తనను ఇంటికి రప్పించేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలెట్టారు. ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అయినా ఫలితం దక్కలేదు. ఎట్టకేలకు సామాజికవేత్త విశాల్​ రంజన్​ ధాతువార్ సహకారంతో భారత్​కు చేరుకున్నాడు.

"జులైలో నాకు ఓ నివేదిక ఇచ్చారు. సతీష్​ విషయంపై నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. ఆ దేశ ప్రధాని షేక్​ హసీనాకు లేఖ రాశాను. భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ పంపాను. ప్రధాని మోదీకి లేఖ రాశాను. ఆయన విదేశాంగ శాఖకు ఆదేశాలిచ్చారు. జైశంకర్​కు లేఖ రాశాను. ఆయన బంగ్లాదేశ్​లోని రాయబారులకు సతీష్ వ్యవహారం అప్పగించారు. ఆగస్టు 4న నాకు బంగ్లాదేశ్​ నుంచి ఫోన్​, ఈమెయిల్ వచ్చింది. "
-విశాల్​ రంజన్​ ధాతువార్, సామాజికవేత్త

శుక్రవారం సాయంత్రం సతీష్​ పట్నాకు చేరుకున్నాడు. అక్కడి నుంచి దర్భంగాకు చేరాడు. గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఇన్నేళ్లు పరాయి దేశంలో జీవచ్ఛవంలా కాలం గడిపిన సతీష్ పునర్​జన్మ పొందినట్టుగా​ ఆనందంతో తల్లిని చేరాడు.
కానీ, మానసికంగా కాస్త దెబ్బతిన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు సతీష్. బంగ్లాదేశ్​కు ఎలా వెళ్లావు అని అడిగితే నాకేమీ గుర్తులేదని చెబుతున్నాడు.

ఇదీ చూడండి:పెద్ద పులుల పండుగ.. సాగిందిలా సంబరంగా!

బంగ్లా​ జైల్లో 11ఏళ్లు.. ఇంటికొచ్చాక ఉప్పొంగిన తల్లి కన్నీళ్లు!
11 ఏళ్లు బంగ్లాదేశ్​ జైల్లో గడిపిన సతీష్​ ఎట్టకేలకు ఓ సామాజికవేత్త చొరవతో ఇంటికి చేరాడు.

బిహార్ దర్భంగ జిల్లాకు చెందిన సతీష్ 2008లో​ వైద్యం చేయించుకునేందుకు రాజధాని పట్నాకు వెళ్లాడు. కానీ, ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు బంధువులు అతని కోసం గాలించారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. ఏళ్లు గడిచినా సతీష్​ ఆచూకీ దొరకలేదు.

2012లో అతని బంధువు ఒకరికి సతీష్​ బంగ్లాదేశ్​ జైల్లో ఉన్నాడన్న విషయం తెలిసింది. కుటుంబసభ్యులు తనను ఇంటికి రప్పించేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలెట్టారు. ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అయినా ఫలితం దక్కలేదు. ఎట్టకేలకు సామాజికవేత్త విశాల్​ రంజన్​ ధాతువార్ సహకారంతో భారత్​కు చేరుకున్నాడు.

"జులైలో నాకు ఓ నివేదిక ఇచ్చారు. సతీష్​ విషయంపై నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. ఆ దేశ ప్రధాని షేక్​ హసీనాకు లేఖ రాశాను. భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ పంపాను. ప్రధాని మోదీకి లేఖ రాశాను. ఆయన విదేశాంగ శాఖకు ఆదేశాలిచ్చారు. జైశంకర్​కు లేఖ రాశాను. ఆయన బంగ్లాదేశ్​లోని రాయబారులకు సతీష్ వ్యవహారం అప్పగించారు. ఆగస్టు 4న నాకు బంగ్లాదేశ్​ నుంచి ఫోన్​, ఈమెయిల్ వచ్చింది. "
-విశాల్​ రంజన్​ ధాతువార్, సామాజికవేత్త

శుక్రవారం సాయంత్రం సతీష్​ పట్నాకు చేరుకున్నాడు. అక్కడి నుంచి దర్భంగాకు చేరాడు. గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఇన్నేళ్లు పరాయి దేశంలో జీవచ్ఛవంలా కాలం గడిపిన సతీష్ పునర్​జన్మ పొందినట్టుగా​ ఆనందంతో తల్లిని చేరాడు.
కానీ, మానసికంగా కాస్త దెబ్బతిన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు సతీష్. బంగ్లాదేశ్​కు ఎలా వెళ్లావు అని అడిగితే నాకేమీ గుర్తులేదని చెబుతున్నాడు.

ఇదీ చూడండి:పెద్ద పులుల పండుగ.. సాగిందిలా సంబరంగా!

Intro:Body:Conclusion:
Last Updated : Sep 30, 2019, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.