ETV Bharat / bharat

త్వరలోనే భారత్​- చైనా దౌత్యస్థాయి చర్చలు!

author img

By

Published : Jun 22, 2020, 6:05 PM IST

త్వరలోనే భారత్​-చైనా మధ్య దౌత్యస్థాయిలో చర్చలు జరిగే అవకాశముందని తెలుస్తోంది. ఇందు కోసం ఇరు దేశాల అధికారులు ఓ తేదీని నిర్ణయించే పనిలో ఉన్నట్టు సమాచారం.

After military talks, India, China may engage in diplomatic talks soon
త్వరలోనే భారత్​-చైనా మధ్య దౌత్యస్థాయి చర్చలు!

గల్వాన్​ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణ అనంతరం భారత్​-చైనా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు ఇరు దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం చైనా పరిధిలోని మోల్డోలో లెఫ్టినెంట్​ జనరల్​ స్థాయిలో సైనిక చర్చలు జరిగాయి. అయితే త్వరలోనే దౌత్యస్థాయిలోనూ చర్చలు జరపాలని భారత్​-చైనా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇరు దేశాల అధికారులు.. ఈ సమావేశానికి సంబంధించిన తేదీని నిర్ణయించే పనిలో పడినట్టు సమాచారం.

ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. ఇరు దేశాల సంయుక్త కార్యదర్శుల స్థాయిలో ఈ భేటీ జరిగే అవకాశముంది.

చైనా సైనికులు గత నెల నుంచి భారత్​పై కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఈ నెల 15న జరిగిన గల్వాన్​ ఘర్షణతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ ఘటనలో 20మంది భారత జవాన్లు అమరులయ్యారు.

ఆర్​ఐసీ సమావేశం...

మంగళవారం రష్యా నేతృత్వంలో జరగనున్న ఆర్​ఐసీ(రష్యా, ఇండియా, చైనా) సమావేశం జరగనుంది. ఇందులో భారత విదేశాంగమంత్రి జైశంకర్​, చైనా విదేశాంగమంత్రి వాంగ్​యీ పాల్గొననున్నారు. అయితే ఇందులో కరోనా సంక్షోభం ప్రధాన అజెండా.

గల్వాన్​ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణ అనంతరం భారత్​-చైనా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు ఇరు దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం చైనా పరిధిలోని మోల్డోలో లెఫ్టినెంట్​ జనరల్​ స్థాయిలో సైనిక చర్చలు జరిగాయి. అయితే త్వరలోనే దౌత్యస్థాయిలోనూ చర్చలు జరపాలని భారత్​-చైనా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇరు దేశాల అధికారులు.. ఈ సమావేశానికి సంబంధించిన తేదీని నిర్ణయించే పనిలో పడినట్టు సమాచారం.

ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. ఇరు దేశాల సంయుక్త కార్యదర్శుల స్థాయిలో ఈ భేటీ జరిగే అవకాశముంది.

చైనా సైనికులు గత నెల నుంచి భారత్​పై కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఈ నెల 15న జరిగిన గల్వాన్​ ఘర్షణతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ ఘటనలో 20మంది భారత జవాన్లు అమరులయ్యారు.

ఆర్​ఐసీ సమావేశం...

మంగళవారం రష్యా నేతృత్వంలో జరగనున్న ఆర్​ఐసీ(రష్యా, ఇండియా, చైనా) సమావేశం జరగనుంది. ఇందులో భారత విదేశాంగమంత్రి జైశంకర్​, చైనా విదేశాంగమంత్రి వాంగ్​యీ పాల్గొననున్నారు. అయితే ఇందులో కరోనా సంక్షోభం ప్రధాన అజెండా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.