ETV Bharat / bharat

ఆప్​: 'ఇదే సరైన తరుణం.. జాతీయ పార్టీగా ఎదుగుదాం'

author img

By

Published : Feb 17, 2020, 12:06 PM IST

Updated : Mar 1, 2020, 2:41 PM IST

ప్రస్తుతం రాష్ట్రస్థాయి పార్టీగా ఉన్న ఆప్​.. జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు వ్యూహరచన చేస్తోంది. ప్రజల్లో తమకున్న సానుకూల దృక్పథాన్ని వినియోగించుకుని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ.. మూడు దశల్లో పార్టీని బలోపేతం చేయాలని చూస్తోంది. ఇందులో మొదటిదశ భాగంగా ఈనెల 23 నుంచి 'రాష్ట్ర నిర్మాణ్'​ పేరుతో దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించనుంది.

AAP expansion plan: Party to connect with one crore people under month-long nationwide campaign
ఆప్​: 'ఇదే సరైన తరుణం.. జాతీయ పార్టీగా ఎదుగుదాం'

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. మూడోసారి అధికార పీఠాన్ని అధిష్ఠించిన ఆమ్ ఆద్మీ.. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 23 నుంచి మార్చి 23 వరకు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రచారాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. 'రాష్ట్ర నిర్మాణ్​' పేరుతో చేపట్టే ఈ ప్రచారాల ద్వారా కొత్తగా కోటి మందిని పార్టీ​లోకి చేర్చాలని పార్టీ నేతలకు స్పష్టం చేసినట్లు వెల్లడించారు ఆప్​ సీనియర్ నేత గోపాల్ రాయ్.

ఆదివారం రాంలీలా మైదానంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్​తో పాటు దిల్లీ కేబినెట్​లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాయ్.. మిగతా మంత్రివర్గ సభ్యులతో కలిసి దిల్లీ ఆప్​ కార్యకర్తలతో భేటీ అయ్యారు​. మొత్తం మూడు దశల్లో.. 'రాష్ట్ర నిర్మాణ్'​ చేపట్టాలని పార్టీనేతలు దిశానిర్దేశం చేసినట్లు వెల్లడించారు.

" మొదటగా ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు రాష్ట్ర నిర్మాణ్​ పేరుతో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల ఆప్​ నేతలు ప్రచారాలు ప్రారంభిస్తారు. రెండో దశలో 9871010101 ఫోన్​ నెంబర్​కు మిస్డ్​ కాల్​ ఇచ్చి 'రాష్ట్ర నిర్మాణ్​' ప్రచారంలో భాగమవ్వాలని ప్రజలను ఆహ్వానిస్తూ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టర్లు విడుదల చేస్తాం.

మూడోదశలో ఆప్​ పార్టీలో చేరడం ద్వారా దేశనిర్మాణం ఎలా చేపట్టొచ్చన్న సందేశాన్ని ప్రజలకు వివరిస్తూ.. అన్ని రాష్ట్రాల్లోని ఆప్​ అధ్యక్షులు, కార్యకర్తలు.. ఆయా రాష్ట్రాల్లోని రాజధానుల్లో మీడియా సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం మిగతా ప్రధాన నగరాల్లోనూ విలేకరుల సమాశేవాలు ఏర్పాటు చేస్తారు."

- గోపాల్ రాయ్, ఆప్​ సీనియర్​ నేత

స్థానిక ఎన్నికలతో గట్టి పునాదులు

రానున్న రోజుల్లో దాదాపు చాలా రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు ఉన్నందున.. ఈ ప్రచారాలతో ఆయా ప్రాంతాల్లో పార్టీ పునాదులను బలపరిచి.. ప్రజలను ప్రభావితం చేసి.. ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించొచ్చని భావిస్తున్నట్లు రాయ్​ వెల్లడించారు.

" ఈనెల 11వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటికే 12 లక్షల మంది 9871010101 ఫోన్​ నెంబర్​కు మిస్డ్​కాల్ ఇచ్చి ఆప్​లో చేరారు. అయితే ఏఏ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్నది రెండోదశలో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది."

- గోపాల్ రాయ్, ఆప్​ సీనియర్​ నేత

రాష్ట్రస్థాయి పార్టీనే..!

ప్రస్తుతం ఆప్​ను రాష్ట్రస్థాయి పార్టీగానే గుర్తించింది ఎన్నికల సంఘం. 2017లో పంజాబ్​లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కూడా అవతరించింది. అయితే... జాతీయ పార్టీగా ఎదగాలన్న ఆమ్​ ఆద్మీ నేతల కలలు.. లోక్​సభ ఎన్నికలతో పాటు గోవాలోనూ పరాజయం పొందినందున అక్కడే ఆగిపోయాయి.

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. మూడోసారి అధికార పీఠాన్ని అధిష్ఠించిన ఆమ్ ఆద్మీ.. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 23 నుంచి మార్చి 23 వరకు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రచారాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. 'రాష్ట్ర నిర్మాణ్​' పేరుతో చేపట్టే ఈ ప్రచారాల ద్వారా కొత్తగా కోటి మందిని పార్టీ​లోకి చేర్చాలని పార్టీ నేతలకు స్పష్టం చేసినట్లు వెల్లడించారు ఆప్​ సీనియర్ నేత గోపాల్ రాయ్.

ఆదివారం రాంలీలా మైదానంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్​తో పాటు దిల్లీ కేబినెట్​లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాయ్.. మిగతా మంత్రివర్గ సభ్యులతో కలిసి దిల్లీ ఆప్​ కార్యకర్తలతో భేటీ అయ్యారు​. మొత్తం మూడు దశల్లో.. 'రాష్ట్ర నిర్మాణ్'​ చేపట్టాలని పార్టీనేతలు దిశానిర్దేశం చేసినట్లు వెల్లడించారు.

" మొదటగా ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు రాష్ట్ర నిర్మాణ్​ పేరుతో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల ఆప్​ నేతలు ప్రచారాలు ప్రారంభిస్తారు. రెండో దశలో 9871010101 ఫోన్​ నెంబర్​కు మిస్డ్​ కాల్​ ఇచ్చి 'రాష్ట్ర నిర్మాణ్​' ప్రచారంలో భాగమవ్వాలని ప్రజలను ఆహ్వానిస్తూ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టర్లు విడుదల చేస్తాం.

మూడోదశలో ఆప్​ పార్టీలో చేరడం ద్వారా దేశనిర్మాణం ఎలా చేపట్టొచ్చన్న సందేశాన్ని ప్రజలకు వివరిస్తూ.. అన్ని రాష్ట్రాల్లోని ఆప్​ అధ్యక్షులు, కార్యకర్తలు.. ఆయా రాష్ట్రాల్లోని రాజధానుల్లో మీడియా సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం మిగతా ప్రధాన నగరాల్లోనూ విలేకరుల సమాశేవాలు ఏర్పాటు చేస్తారు."

- గోపాల్ రాయ్, ఆప్​ సీనియర్​ నేత

స్థానిక ఎన్నికలతో గట్టి పునాదులు

రానున్న రోజుల్లో దాదాపు చాలా రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు ఉన్నందున.. ఈ ప్రచారాలతో ఆయా ప్రాంతాల్లో పార్టీ పునాదులను బలపరిచి.. ప్రజలను ప్రభావితం చేసి.. ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించొచ్చని భావిస్తున్నట్లు రాయ్​ వెల్లడించారు.

" ఈనెల 11వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటికే 12 లక్షల మంది 9871010101 ఫోన్​ నెంబర్​కు మిస్డ్​కాల్ ఇచ్చి ఆప్​లో చేరారు. అయితే ఏఏ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్నది రెండోదశలో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది."

- గోపాల్ రాయ్, ఆప్​ సీనియర్​ నేత

రాష్ట్రస్థాయి పార్టీనే..!

ప్రస్తుతం ఆప్​ను రాష్ట్రస్థాయి పార్టీగానే గుర్తించింది ఎన్నికల సంఘం. 2017లో పంజాబ్​లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కూడా అవతరించింది. అయితే... జాతీయ పార్టీగా ఎదగాలన్న ఆమ్​ ఆద్మీ నేతల కలలు.. లోక్​సభ ఎన్నికలతో పాటు గోవాలోనూ పరాజయం పొందినందున అక్కడే ఆగిపోయాయి.

Last Updated : Mar 1, 2020, 2:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.