కరోనా విజృంభణతో చాలా దేశాలు వెంటిలేటర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ ఖరీదులో అందుబాటులో ఉండే వెంటిలేటర్ను రూపొందిచారు కర్ణాటకకు చెందిన ఓ ప్రొఫెసర్. జనతా వెంటిలేటర్ పేరుతో కేవలం రూ. 7వేలకే అందుబాటులోకి తెచ్చారు.
ధార్వాడ్ జిల్లాలోని ఎస్డీఎం ఇంజినీరింగ్ కాలేజ్లో ఆచార్యునిగా పని చేస్తున్న డా. ఎంఆర్ కపాలి..ఈ ఆవిష్కరణకు ప్రాణం పోశారు. గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని తయారు చేసినట్లు తెలిపారు. జనతా వెంటిలేటర్ను విద్యుత్తో పాటు మాన్యువల్గానూ ఆపరేట్ చేయొచ్చని స్పష్టం చేశారు కపాలి.
ఇదీ చదవండి: ఆ ఆరుగురు మృతికి కారణం పుట్టగొడుగులే!