ETV Bharat / bharat

'లాక్​డౌన్'​ ఉల్లంఘిస్తే ఒక్కరి నుంచే 406 మందికి కరోనా!

author img

By

Published : Apr 7, 2020, 7:17 PM IST

దేశంలో కరోనా కోరలు చాస్తున్న వేళ భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) మరో ఆశ్చర్యకర విషయం వెల్లడించింది. కరోనా సోకిన వ్యక్తి.. లాక్​డౌన్​, భౌతిక దూరం వంటి నివారణ చర్యలు పాటించకపోతే అతని నుంచి మరో 406 మందికి వైరస్​ సంక్రమించే అవకాశముందని వెల్లడించింది.

A COVID-19 patient can infect 406 people in 30 days if preventive measures not in place: ICMR study
'లాక్​డౌన్'​ పాటించకుంటే ఒక్కరి నుంచే 406 మందికి కరోనా!

కరోనా బారిన పడ్డ వ్యక్తి.. లాక్​డౌన్​, భౌతిక దూరం వంటి ముందస్తు నివారణ చర్యలు పాటించకపోతే అతడు నెలరోజుల్లో మరో 406 మందికి వైరస్​ను వ్యాపింపచేయగలడని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) అధ్యయనంలో తేలింది. అదే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్​ వ్యాప్తి తగ్గే అవకాశం ఉన్నట్లు వారి పరిశీలనలో స్పష్టమైంది. ఇలా చేయడం ద్వారా ఈ 30 రోజుల వ్యవధిలో ఇన్​ఫెక్షన్ బారిన పడే వారి సంఖ్యను సగటున రెండున్నరకు తగ్గించవచ్చని తెలిపారు ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్​.

ప్రస్తుతం దేశంలో వైరస్​ పునరుత్పత్తి సంక్రమణ సంఖ్య(ఆర్​ఓ) 1.5 నుంచి 4గా ఉన్నట్లు వెల్లడించారు అగర్వాల్.

''ఒకవేళ ఆర్​ఓ 2.5గా ఉంటే.. కరోనా సోకిన ఓ వ్యక్తి నెల రోజుల్లో 406 మందికి వ్యాపింపచేయగలడు. అదే సమయంలో.. లాక్​డౌన్​, భౌతిక దూరం నిబంధనలు కట్టుదిట్టంగా పాటిస్తే దానిని సుమారు 75 శాతం తగ్గించవచ్చు. అంటే ఒక బాధితుడు.. మరో 2.5 మందికే వ్యాపింపజేసే అవకాశాలుంటాయి.''

- లవ్​ అగర్వాల్​, కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి

'ఆర్​ఓ' అనేది కరోనా వ్యాప్తిని తెలియజేసేందుకు ఉపయోగించే గణిత సంకేతం.

కరోనా బారిన పడ్డ వ్యక్తి.. లాక్​డౌన్​, భౌతిక దూరం వంటి ముందస్తు నివారణ చర్యలు పాటించకపోతే అతడు నెలరోజుల్లో మరో 406 మందికి వైరస్​ను వ్యాపింపచేయగలడని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) అధ్యయనంలో తేలింది. అదే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్​ వ్యాప్తి తగ్గే అవకాశం ఉన్నట్లు వారి పరిశీలనలో స్పష్టమైంది. ఇలా చేయడం ద్వారా ఈ 30 రోజుల వ్యవధిలో ఇన్​ఫెక్షన్ బారిన పడే వారి సంఖ్యను సగటున రెండున్నరకు తగ్గించవచ్చని తెలిపారు ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్​.

ప్రస్తుతం దేశంలో వైరస్​ పునరుత్పత్తి సంక్రమణ సంఖ్య(ఆర్​ఓ) 1.5 నుంచి 4గా ఉన్నట్లు వెల్లడించారు అగర్వాల్.

''ఒకవేళ ఆర్​ఓ 2.5గా ఉంటే.. కరోనా సోకిన ఓ వ్యక్తి నెల రోజుల్లో 406 మందికి వ్యాపింపచేయగలడు. అదే సమయంలో.. లాక్​డౌన్​, భౌతిక దూరం నిబంధనలు కట్టుదిట్టంగా పాటిస్తే దానిని సుమారు 75 శాతం తగ్గించవచ్చు. అంటే ఒక బాధితుడు.. మరో 2.5 మందికే వ్యాపింపజేసే అవకాశాలుంటాయి.''

- లవ్​ అగర్వాల్​, కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి

'ఆర్​ఓ' అనేది కరోనా వ్యాప్తిని తెలియజేసేందుకు ఉపయోగించే గణిత సంకేతం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.