ETV Bharat / bharat

తినగానే ఈ ఏడు పనులు చేస్తున్నారా... అయితే జాగ్రత్త!

author img

By

Published : Mar 15, 2020, 2:44 PM IST

ఇప్పడు అందరూ 'ఫిట్​నెస్​' మంత్రాను అనుసరిస్తున్నారు. డైట్​ పేరుతో కొందరు తిండిని తగ్గించేస్తుంటే.. మరికొందరు తెలిసి తెలియక ఆహారపు అలవాట్లల్లో తప్పులు చేస్తున్నారు. సరైన పద్ధతిని అనుసరిస్తూ.. ఫిట్​గా ఉండాలంటే తప్పకుండా పాటించాల్సిన ఈ ఏడు విషయాలను ఒక్కసారి చూసేయండి మరి.

7 Things You Should Never Do Right After Eating Your Meal
తినగానే ఈ ఏడు పనులు చేస్తున్నారా... అయితే జాగ్రత్త!

అందం, ఆరోగ్యం కాపాడుకోడానికి ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ఆహారంలో క్యాలరీలు తక్కువగా ఉండేవి చూసుకుని, ఎంత కష్టమైనా సరే.. సగం ఆకలిని దిగమింగేస్తాం. అయితే ఆహారం ఎంత తగ్గించినా.. భోంచేసిన వెంటనే ఈ 7 పనులు చేస్తే మాత్రం అనారోగ్యం తప్పదంటున్నారు వైద్యులు. మరి ఆ ఏడు పనులేంటో చూసేయండి.

చాయ్​ మానెయ్

భారతీయులు చాయ్ ప్రియులని వేరే చెప్పనక్కర్లేదు. కడుపులో టీ పడకపోతే.. నానా హైరానా చేస్తారు. కానీ ఎంత ప్రీతికరమైనదైనా.. భోజనం చేసిన వెంటనే గరం గరం చాయ్​ తాగడం ప్రమాదకరమే. టీలో ఆమ్ల గుణాలుంటాయి కాబట్టి, అది సరాసరి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకున్న అనంతరం టీ తాగితే.. చెడు ప్రభావం చాలా ఉంటుంది. ప్రోటీన్లను టీ అరగనివ్వకుండా చేస్తుంది. అయితే.. తిన్నవెంటనే పక్కాగా టీ కావాలనుకునేవారు గ్రీన్​ టీతో సరిపెట్టుకుంటే, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆనందానికి ఆనందం.

పండ్లు తినకపోతేనే మంచిది

పండ్లు త్వరగా జీర్ణం కావు. భోజనానికి ఓ గంట ముందు పండ్లు తింటే చాలా మంచిది. కానీ తిన్న వెంటనే అంటే.. అటు ఆహారాన్ని, ఇటు పండ్లను జీర్ణం చేయడం శరీరానికి ఎంత కష్టమో పాపం.

అప్పుడే పడకుంటే ఎలా?

తిన్న తర్వాత చాలామందికి సహజంగా నిద్ర వస్తుంది. చక్కగా తినేసి పడుకుంటే.. జీర్ణవ్యవస్థ కాస్త ఇబ్బంది పడుతుంది. ఉదరంలో ఆహారం నిండి ఉన్నప్పుడు నిటారుగా ఉంటేనే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. పడుకుంటే జీర్ణం కాదని, నిద్రలేచిన తర్వాత కూడా పొట్ట నిండుగా ఉన్నట్టు అనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

తినగానే స్నానమా?

భోంచేశాక.. మన శరీరం ఆహారాన్ని అరిగించేసి, కరిగించేయాలని దూకుడుగా ఉంటుంది. అలాంటి సమయంలో మనం స్నానం చేస్తే, జీర్ణవ్యవస్థ ఉత్సాహంపై నీళ్లు చల్లినట్టే! స్నానం చేసినప్పుడు శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇక ఆహారాన్ని జీర్ణం చేసే పని పక్కనపెట్టి.. రక్త కణాలన్నీ ఆ ఉష్ణోగ్రతను అదుపు చేసేందుకు బయలుదేరతాయి. అందుకే.. తిండి ముద్దు- ఆ తర్వాత స్నానం వద్దు.

దమ్ము కొడుతున్నారా..?

తినగానే ఒక్క సిగరెట్ తాగితే... పది సిగరెట్లు తాగినంత సమానమంటున్నారు వైద్యులు. భోంచేసిన వెంటనే.. శరీరంలో రక్తప్రసరణ చురుగ్గా ఉంటుంది.. ఆ సమయంలో సిగరెట్లలో ఉండే నికొటిన్ రక్తంలోకి సులభంగా చొచ్చుకుపోతుంది. ఇది క్యాన్సర్​కు దారి తీస్తుంది. ​

భారీ వ్యాయామాలొద్దు

వ్యాయామాలు మంచివే కానీ సమయం, సందర్భం లేకుండా చేస్తే ఏదైనా చేటే కదా! తినగానే వ్యాయామం చేస్తే శరీరం వేడెక్కుతుంది. ఫలితంగా రక్తప్రసరణ పెరుగుతుంది. అయితే, తిన్నాక అలా సరదాగా నడిచి మీ జీర్ణక్రియను పెంపొందించుకోవచ్చు.

పళ్లు తోమనక్కర్లే..

తిన్న తర్వాత పళ్లు తోముకుంటే.. నోరు శుభ్రంగా ఉంటుందనడం వాస్తవమే. అయితే, తిన్న వెంటనే దంతధావనం కాస్త ప్రమాదకరం. తినేటప్పుడు పళ్లకు బాగా పని చెబుతాం కాబట్టి.. ఆహారం తీసుకున్నాక కాసేపటి వరకు పళ్లు బలహీనంగా, అలసిపోయినట్టు ఉంటాయి. మరి ఆ సమయంలో వాటిని బ్రష్​తో రుద్దితే పంటిపై ఉండే ఎనామెల్ పోయే అవకాశాలుంటాయి. కాబట్టి భోజనం అయ్యాక పళ్లకు కనీసం ఓ గంట విశ్రాంతి ఇవ్వండి.​

అందం, ఆరోగ్యం కాపాడుకోడానికి ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ఆహారంలో క్యాలరీలు తక్కువగా ఉండేవి చూసుకుని, ఎంత కష్టమైనా సరే.. సగం ఆకలిని దిగమింగేస్తాం. అయితే ఆహారం ఎంత తగ్గించినా.. భోంచేసిన వెంటనే ఈ 7 పనులు చేస్తే మాత్రం అనారోగ్యం తప్పదంటున్నారు వైద్యులు. మరి ఆ ఏడు పనులేంటో చూసేయండి.

చాయ్​ మానెయ్

భారతీయులు చాయ్ ప్రియులని వేరే చెప్పనక్కర్లేదు. కడుపులో టీ పడకపోతే.. నానా హైరానా చేస్తారు. కానీ ఎంత ప్రీతికరమైనదైనా.. భోజనం చేసిన వెంటనే గరం గరం చాయ్​ తాగడం ప్రమాదకరమే. టీలో ఆమ్ల గుణాలుంటాయి కాబట్టి, అది సరాసరి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకున్న అనంతరం టీ తాగితే.. చెడు ప్రభావం చాలా ఉంటుంది. ప్రోటీన్లను టీ అరగనివ్వకుండా చేస్తుంది. అయితే.. తిన్నవెంటనే పక్కాగా టీ కావాలనుకునేవారు గ్రీన్​ టీతో సరిపెట్టుకుంటే, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆనందానికి ఆనందం.

పండ్లు తినకపోతేనే మంచిది

పండ్లు త్వరగా జీర్ణం కావు. భోజనానికి ఓ గంట ముందు పండ్లు తింటే చాలా మంచిది. కానీ తిన్న వెంటనే అంటే.. అటు ఆహారాన్ని, ఇటు పండ్లను జీర్ణం చేయడం శరీరానికి ఎంత కష్టమో పాపం.

అప్పుడే పడకుంటే ఎలా?

తిన్న తర్వాత చాలామందికి సహజంగా నిద్ర వస్తుంది. చక్కగా తినేసి పడుకుంటే.. జీర్ణవ్యవస్థ కాస్త ఇబ్బంది పడుతుంది. ఉదరంలో ఆహారం నిండి ఉన్నప్పుడు నిటారుగా ఉంటేనే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. పడుకుంటే జీర్ణం కాదని, నిద్రలేచిన తర్వాత కూడా పొట్ట నిండుగా ఉన్నట్టు అనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

తినగానే స్నానమా?

భోంచేశాక.. మన శరీరం ఆహారాన్ని అరిగించేసి, కరిగించేయాలని దూకుడుగా ఉంటుంది. అలాంటి సమయంలో మనం స్నానం చేస్తే, జీర్ణవ్యవస్థ ఉత్సాహంపై నీళ్లు చల్లినట్టే! స్నానం చేసినప్పుడు శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇక ఆహారాన్ని జీర్ణం చేసే పని పక్కనపెట్టి.. రక్త కణాలన్నీ ఆ ఉష్ణోగ్రతను అదుపు చేసేందుకు బయలుదేరతాయి. అందుకే.. తిండి ముద్దు- ఆ తర్వాత స్నానం వద్దు.

దమ్ము కొడుతున్నారా..?

తినగానే ఒక్క సిగరెట్ తాగితే... పది సిగరెట్లు తాగినంత సమానమంటున్నారు వైద్యులు. భోంచేసిన వెంటనే.. శరీరంలో రక్తప్రసరణ చురుగ్గా ఉంటుంది.. ఆ సమయంలో సిగరెట్లలో ఉండే నికొటిన్ రక్తంలోకి సులభంగా చొచ్చుకుపోతుంది. ఇది క్యాన్సర్​కు దారి తీస్తుంది. ​

భారీ వ్యాయామాలొద్దు

వ్యాయామాలు మంచివే కానీ సమయం, సందర్భం లేకుండా చేస్తే ఏదైనా చేటే కదా! తినగానే వ్యాయామం చేస్తే శరీరం వేడెక్కుతుంది. ఫలితంగా రక్తప్రసరణ పెరుగుతుంది. అయితే, తిన్నాక అలా సరదాగా నడిచి మీ జీర్ణక్రియను పెంపొందించుకోవచ్చు.

పళ్లు తోమనక్కర్లే..

తిన్న తర్వాత పళ్లు తోముకుంటే.. నోరు శుభ్రంగా ఉంటుందనడం వాస్తవమే. అయితే, తిన్న వెంటనే దంతధావనం కాస్త ప్రమాదకరం. తినేటప్పుడు పళ్లకు బాగా పని చెబుతాం కాబట్టి.. ఆహారం తీసుకున్నాక కాసేపటి వరకు పళ్లు బలహీనంగా, అలసిపోయినట్టు ఉంటాయి. మరి ఆ సమయంలో వాటిని బ్రష్​తో రుద్దితే పంటిపై ఉండే ఎనామెల్ పోయే అవకాశాలుంటాయి. కాబట్టి భోజనం అయ్యాక పళ్లకు కనీసం ఓ గంట విశ్రాంతి ఇవ్వండి.​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.