ETV Bharat / bharat

భార్య ప్రసవం కోసం 600 కి.మీ 'లాక్​డౌన్ యాత్ర'

author img

By

Published : Apr 5, 2020, 2:03 PM IST

దేశవ్యాప్తంగా లాక్​డౌన్ అమల్లో ఉంది.​ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఇలాంటి సమయంలో ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తి తనకు పుట్టబోయే బిడ్డను చూసేందుకు ఇంటికి బయలుదేరాడు. దిల్లీ నుంచి 600 కిలోమీటర్లు ప్రయాణించి అనుకున్న రోజుకు స్వగ్రామాన్ని చేరుకున్నాడు. మరి దేశమంతా లాక్​డౌన్​ ఉండగా ఎలా వెళ్లాడు?

600 km to home - daily wager reaches home just in time to see his baby's birth
కొడుకును చూడటానికి.. 600 కిలోమీటర్లు ప్రయాణం

ఒకవైపు దేశంలో కరోనా పంజా విసురుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ అమల్లో ఉంది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఇలాంటి పరిస్థతుల మధ్య తన భార్య ప్రసవం నాటికి ఇంటికి చేరుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. దృఢ సంకల్పంతో దిల్లీకి 600 కిలోమీటర్ల దూరమున్న స్వగ్రామానికి అనుకున్న సమయానికి చేరుకున్నాడు ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ముకేశ్​ మౌర్య. అయితే ఇది ఎలా సాధ్యమైంది?

ఇదీ జరిగింది...

ఉత్తర్​ప్రదేశ్​ అమేఠి జిల్లా ముసాఫిర్ఖానాకు చెందిన ముకేశ్​ మౌర్య.. కుటుంబ పోషణ కోసం దిల్లీలోని రాజౌరి గార్డెన్​లో రోజువారీ కూలీగా పని చేసేవాడు. అయితే మాయదారి కరోనా కారణంగా దేశంలో పరిస్థితులు మారిపోయాయి. లాక్​డౌన్​ ప్రకటించారు. పనిలేదు. భార్య నిండు గర్భిణి. ఆమె ప్రసవం నాటికి ఇంటికి చేరుకోవాలనే సంకల్పంతో అక్కడ నుంచి నడక మొదలు పెట్టాడు ముకేశ్​. 'మనసుంటే మార్గం ఉంటుంది' అనే స్ఫూర్తితో చివరకు ఇంటికి చేరుకున్నాడు.

అష్టకష్టాలు పడి..

​తన సొంత గ్రామమైన ముసాఫిర్ఖానా చేరుకోవడానికి ముకేశ్​ అష్టకష్టాలు పడ్డాడు. రైళ్లు తిరగడం లేదు. రవాణా సేవలు పూర్తిగా నిలిపివేశారు. ఈ క్రమంలో మిగిలిన వలసదారులతో నడక ప్రారంభించి తిండి లేకుండా ప్రయాణం చేశాడు. చాలా గంటలు నడిచాడు. అయితే ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం తమ రాష్ట్రపౌరుల కోసం దిల్లీ నుంచి ఉత్తర్​ప్రదేశ్​కు బస్సు సర్వీసులు నడిపింది. వైరస్​ వ్యాప్తి భయాల నడుమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులో 20 గంటలు పాటు ప్రయాణం చేసి ఇంటికి చేరుకున్నాడు.

తక్షణమే..

'నేను ఇంటికి చేరుకునే సమయానికి నా భార్య పురుటినొప్పులతో బాధ పడుతుంది. బంధువుల సాయంతో తక్షణమే అంబులెన్స్​ ఏర్పాటు చేసి ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఆమె పండంటి మగబిడ్డకు జన్మ నిచ్చింది. తండ్రి అయినందుకు గర్వంగా ఉంది. ఆ కష్టతరమైన ప్రయాణం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది' అని అన్నాడు ముకేశ్.

ఇదీ చూడండి: పందిట్లో ఉండాల్సిన వరుడు కరోనా విధుల్లో నిమగ్నమైతే...

ఒకవైపు దేశంలో కరోనా పంజా విసురుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ అమల్లో ఉంది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఇలాంటి పరిస్థతుల మధ్య తన భార్య ప్రసవం నాటికి ఇంటికి చేరుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. దృఢ సంకల్పంతో దిల్లీకి 600 కిలోమీటర్ల దూరమున్న స్వగ్రామానికి అనుకున్న సమయానికి చేరుకున్నాడు ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ముకేశ్​ మౌర్య. అయితే ఇది ఎలా సాధ్యమైంది?

ఇదీ జరిగింది...

ఉత్తర్​ప్రదేశ్​ అమేఠి జిల్లా ముసాఫిర్ఖానాకు చెందిన ముకేశ్​ మౌర్య.. కుటుంబ పోషణ కోసం దిల్లీలోని రాజౌరి గార్డెన్​లో రోజువారీ కూలీగా పని చేసేవాడు. అయితే మాయదారి కరోనా కారణంగా దేశంలో పరిస్థితులు మారిపోయాయి. లాక్​డౌన్​ ప్రకటించారు. పనిలేదు. భార్య నిండు గర్భిణి. ఆమె ప్రసవం నాటికి ఇంటికి చేరుకోవాలనే సంకల్పంతో అక్కడ నుంచి నడక మొదలు పెట్టాడు ముకేశ్​. 'మనసుంటే మార్గం ఉంటుంది' అనే స్ఫూర్తితో చివరకు ఇంటికి చేరుకున్నాడు.

అష్టకష్టాలు పడి..

​తన సొంత గ్రామమైన ముసాఫిర్ఖానా చేరుకోవడానికి ముకేశ్​ అష్టకష్టాలు పడ్డాడు. రైళ్లు తిరగడం లేదు. రవాణా సేవలు పూర్తిగా నిలిపివేశారు. ఈ క్రమంలో మిగిలిన వలసదారులతో నడక ప్రారంభించి తిండి లేకుండా ప్రయాణం చేశాడు. చాలా గంటలు నడిచాడు. అయితే ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం తమ రాష్ట్రపౌరుల కోసం దిల్లీ నుంచి ఉత్తర్​ప్రదేశ్​కు బస్సు సర్వీసులు నడిపింది. వైరస్​ వ్యాప్తి భయాల నడుమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులో 20 గంటలు పాటు ప్రయాణం చేసి ఇంటికి చేరుకున్నాడు.

తక్షణమే..

'నేను ఇంటికి చేరుకునే సమయానికి నా భార్య పురుటినొప్పులతో బాధ పడుతుంది. బంధువుల సాయంతో తక్షణమే అంబులెన్స్​ ఏర్పాటు చేసి ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఆమె పండంటి మగబిడ్డకు జన్మ నిచ్చింది. తండ్రి అయినందుకు గర్వంగా ఉంది. ఆ కష్టతరమైన ప్రయాణం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది' అని అన్నాడు ముకేశ్.

ఇదీ చూడండి: పందిట్లో ఉండాల్సిన వరుడు కరోనా విధుల్లో నిమగ్నమైతే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.