ETV Bharat / bharat

కరోనా విలయం: కేరళలో మళ్లీ విజృంభణ

author img

By

Published : Aug 20, 2020, 7:09 PM IST

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తమిళనాడులో దాదాపు 6 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. కేరళలో 1,968, దిల్లీలో 12 వందలకు పైగా కొవిడ్ కేసులు బయటపడ్డాయి.

5,986 new #COVID19 cases, 5,742 recoveries & 116 deaths reported today in Tamil Nadu
కరోనా విలయం- తమిళనాడు, కేరళలో విజృంభణ

తమిళనాడులో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. మరో 5,986 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3,61,435కి చేరింది. ఏకంగా 116 మంది మృత్యువాత పడ్డారు. ఫలితంగా రాష్ట్రంలో మరణాల సంఖ్య 6,239కి పెరిగింది. 5,742 మంది తాజాగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో రికవరీల సంఖ్య 3,01,913కి చేరింది. ప్రస్తుతం 53,283 యాక్టివ్ కేసులున్నాయి.

కేరళలో కొత్తగా 1,968 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. 9 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసులు 52 వేలు దాటాయి. 18,123 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

రాజధాని

దిల్లీలో మరో 1,215 కరోనా కేసులు గుర్తించారు అధికారులు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,57,354కి చేరింది. మరో 22 మంది కొవిడ్ ధాటికి ప్రాణాలు కోల్పోగా.. మొత్తంగా 4,257 మంది మృత్యువాత పడ్డట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 1,059 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. మొత్తం రికవరీల సంఖ్య 1,41,826గా ఉన్నట్లు స్పష్టం చేశారు.

మణిపుర్​

మణిపుర్​లో తాజాగా 49 కేసులు నమోదయ్యాయి. ఇందులో 9 మంది కేంద్ర సాయుధ బలగాలు ఉన్నట్లు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య 4,925కి చేరినట్లు చెప్పారు. ప్రస్తుతం 1,905 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 3,002 మంది కోలుకున్నట్లు స్పష్టం చేశారు.

హిమాచల్​ ప్రదేశ్

హిమాచల్​ప్రదేశ్​లో కరోనా బాధితుల సంఖ్య 4,472కి చేరినట్లు అక్కడి వైద్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తం 21 మంది కరోనాకు బలైనట్లు తెలిపింది. 1,343 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,066 మంది కోలుకున్నట్లు వెల్లడించింది.

మరణాలు లేని మిజోరం

మిజోరంలో మరొకరికి కరోనా పాజిటివ్​గా తేలింది. మరో 18 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 874కి చేరింది. ఇందులో 472 మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటుండగా.. 402 మంది రికవర్ అయ్యారు. ఇప్పటివరకు మిజోరంలో కరోనాతో ఒక్కరు కూడా మరణించలేదు.

ఇదీ చదవండి- రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు- రోజుకు 10 లక్షల దిశగా

తమిళనాడులో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. మరో 5,986 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3,61,435కి చేరింది. ఏకంగా 116 మంది మృత్యువాత పడ్డారు. ఫలితంగా రాష్ట్రంలో మరణాల సంఖ్య 6,239కి పెరిగింది. 5,742 మంది తాజాగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో రికవరీల సంఖ్య 3,01,913కి చేరింది. ప్రస్తుతం 53,283 యాక్టివ్ కేసులున్నాయి.

కేరళలో కొత్తగా 1,968 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. 9 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసులు 52 వేలు దాటాయి. 18,123 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

రాజధాని

దిల్లీలో మరో 1,215 కరోనా కేసులు గుర్తించారు అధికారులు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,57,354కి చేరింది. మరో 22 మంది కొవిడ్ ధాటికి ప్రాణాలు కోల్పోగా.. మొత్తంగా 4,257 మంది మృత్యువాత పడ్డట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 1,059 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. మొత్తం రికవరీల సంఖ్య 1,41,826గా ఉన్నట్లు స్పష్టం చేశారు.

మణిపుర్​

మణిపుర్​లో తాజాగా 49 కేసులు నమోదయ్యాయి. ఇందులో 9 మంది కేంద్ర సాయుధ బలగాలు ఉన్నట్లు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య 4,925కి చేరినట్లు చెప్పారు. ప్రస్తుతం 1,905 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 3,002 మంది కోలుకున్నట్లు స్పష్టం చేశారు.

హిమాచల్​ ప్రదేశ్

హిమాచల్​ప్రదేశ్​లో కరోనా బాధితుల సంఖ్య 4,472కి చేరినట్లు అక్కడి వైద్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తం 21 మంది కరోనాకు బలైనట్లు తెలిపింది. 1,343 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,066 మంది కోలుకున్నట్లు వెల్లడించింది.

మరణాలు లేని మిజోరం

మిజోరంలో మరొకరికి కరోనా పాజిటివ్​గా తేలింది. మరో 18 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 874కి చేరింది. ఇందులో 472 మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటుండగా.. 402 మంది రికవర్ అయ్యారు. ఇప్పటివరకు మిజోరంలో కరోనాతో ఒక్కరు కూడా మరణించలేదు.

ఇదీ చదవండి- రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు- రోజుకు 10 లక్షల దిశగా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.