ETV Bharat / bharat

వారికి స్మార్ట్​ఫోన్లే లేవ్- మరి ఆన్​లైన్​లో చదువెలా?

author img

By

Published : Jun 13, 2020, 3:54 PM IST

దేశంలో 56 శాతం మంది పిల్లలకు స్మార్ట్​ ఫోన్ అందుబాటులో లేదని తాజా అధ్యయనం వెల్లడించింది. అలాంటప్పుడు పాఠశాలలు నిర్వహిస్తున్న ఆన్​లైన్​ తరగతులు, డిజిటల్​ పాఠాలు ఎంత వరకు ఫలితాలనిస్తాయనే ప్రశ్నలు తలెత్తున్నాయి.

56 percentage of indian students does not have access to smart phones amid covid 19 online classses
విద్యార్థులకు స్మార్ట్​ఫోన్లే లేవ్​.. మరి ఆన్​లైన్​లో చదువెలా?

లాక్​డౌన్​ కారణంగా బడి గంటలు మూగబోయాయి. దీంతో పిల్లలంతా ఇంట్లోనే ఉంటున్నారు. ఈ కారణంగా ఇప్పటికే దేశంలో 85 శాతానికి పైగా తల్లిదండ్రులు వారి పిల్లల చదువు, భవిష్యత్తు గురించి బెంగ పెట్టేసుకున్నారని అధ్యయనాలు వెల్లడించాయి. "ఆ ఏముంది... ఆన్​లైన్​ క్లాసులు పెట్టిస్తే వారే చదువుకుంటారు అనుకుంటే పొరపాటే" అంటోంది ఓ సర్వే. దేశంలో 35 కోట్ల మంది విద్యార్థులుంటే... వీరిలో 56 శాతానికిపైగా అసలు స్మార్ట్​ఫోన్ సౌలభ్యమే లేదని తేల్చింది.

దేశమంతా ఇదే పరిస్థితి...

బాలల హక్కుల ఎన్​జీఓ స్మైల్​ ఫౌండేషన్.. విద్యార్థులు సాంకేతికతను ఎంత మేరకు వినియోగించుకుంటున్నారో తెలుసుకునేందుకు.. 'కరోనా కాలంలో ప్రస్తుత పరిస్థితులు-పరిష్కారాలు' అనే అంశంపై సర్వే నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, దిల్లీ, కర్ణాటక, తమిళనాడు, బంగాల్​, మహారాష్ట్ర, గుజరాత్​ వంటి 23 రాష్ట్రాల్లో.. 12 రోజుల పాటు సర్వే నిర్వహించింది. ఈ అధ్యయనంలో 42,831 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

వీరిలో 43.99 శాతం మంది విద్యార్థులు స్మార్ట్​ ఫోన్​లను వినియోగించుకుంటున్నారు. 43.99 శాతం మంది సాధారణ మొబైల్స్ వాడగలుగుతున్నారు. మరో 12.02 శాతం మందికి అసలు ఏ ఫోనూ లేదు.

టీవీ విషయానికొస్తే...

68.99 శాతం మంది టీవీ సౌలభ్యం కలిగి ఉన్నారు. 31.01 శాతం మందికి ఆ అవకాశం కూడా లేదు.

అందుకే, నాణ్యమైన విద్యను స్మార్ట్‌ఫోన్లలో అందించడమనేది పరిష్కారం కాదంటోంది స్మైల్​ ఫౌండేషన్​. అలాగని ఈ సమయంలో నాలుగు గోడల మధ్య విద్యార్థులను కూర్చోబెట్టి చదివించడం సాధ్యపడే పని కాదు.. కాబట్టి వాస్తవిక బోధనా విధానాల అవలంబించాలని సూచిస్తోంది.

"సవాళ్లను అర్థం చేసుకోవడానికి మేము ఒక క్షేత్రస్థాయి అధ్యయనం చేశాము. మహమ్మారి కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి ఇలాంటి సమయంలో విద్యా విధానంలో కావలసిన మార్పులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి. అందుకోసం ప్రస్తుతం పరిస్థితులకు సరిపోయే విధానాలను అభివృద్ధి చేయాలి."

-శాంతను మిశ్రా, స్మైల్​ ఫౌండేషన్​ సహ వ్యవస్థాపకుడు

ఇదీ చదవండి: ఈ 5 వ్యాయామాలతో వృద్ధులు సూపర్ ఫిట్​!

లాక్​డౌన్​ కారణంగా బడి గంటలు మూగబోయాయి. దీంతో పిల్లలంతా ఇంట్లోనే ఉంటున్నారు. ఈ కారణంగా ఇప్పటికే దేశంలో 85 శాతానికి పైగా తల్లిదండ్రులు వారి పిల్లల చదువు, భవిష్యత్తు గురించి బెంగ పెట్టేసుకున్నారని అధ్యయనాలు వెల్లడించాయి. "ఆ ఏముంది... ఆన్​లైన్​ క్లాసులు పెట్టిస్తే వారే చదువుకుంటారు అనుకుంటే పొరపాటే" అంటోంది ఓ సర్వే. దేశంలో 35 కోట్ల మంది విద్యార్థులుంటే... వీరిలో 56 శాతానికిపైగా అసలు స్మార్ట్​ఫోన్ సౌలభ్యమే లేదని తేల్చింది.

దేశమంతా ఇదే పరిస్థితి...

బాలల హక్కుల ఎన్​జీఓ స్మైల్​ ఫౌండేషన్.. విద్యార్థులు సాంకేతికతను ఎంత మేరకు వినియోగించుకుంటున్నారో తెలుసుకునేందుకు.. 'కరోనా కాలంలో ప్రస్తుత పరిస్థితులు-పరిష్కారాలు' అనే అంశంపై సర్వే నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, దిల్లీ, కర్ణాటక, తమిళనాడు, బంగాల్​, మహారాష్ట్ర, గుజరాత్​ వంటి 23 రాష్ట్రాల్లో.. 12 రోజుల పాటు సర్వే నిర్వహించింది. ఈ అధ్యయనంలో 42,831 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

వీరిలో 43.99 శాతం మంది విద్యార్థులు స్మార్ట్​ ఫోన్​లను వినియోగించుకుంటున్నారు. 43.99 శాతం మంది సాధారణ మొబైల్స్ వాడగలుగుతున్నారు. మరో 12.02 శాతం మందికి అసలు ఏ ఫోనూ లేదు.

టీవీ విషయానికొస్తే...

68.99 శాతం మంది టీవీ సౌలభ్యం కలిగి ఉన్నారు. 31.01 శాతం మందికి ఆ అవకాశం కూడా లేదు.

అందుకే, నాణ్యమైన విద్యను స్మార్ట్‌ఫోన్లలో అందించడమనేది పరిష్కారం కాదంటోంది స్మైల్​ ఫౌండేషన్​. అలాగని ఈ సమయంలో నాలుగు గోడల మధ్య విద్యార్థులను కూర్చోబెట్టి చదివించడం సాధ్యపడే పని కాదు.. కాబట్టి వాస్తవిక బోధనా విధానాల అవలంబించాలని సూచిస్తోంది.

"సవాళ్లను అర్థం చేసుకోవడానికి మేము ఒక క్షేత్రస్థాయి అధ్యయనం చేశాము. మహమ్మారి కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి ఇలాంటి సమయంలో విద్యా విధానంలో కావలసిన మార్పులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి. అందుకోసం ప్రస్తుతం పరిస్థితులకు సరిపోయే విధానాలను అభివృద్ధి చేయాలి."

-శాంతను మిశ్రా, స్మైల్​ ఫౌండేషన్​ సహ వ్యవస్థాపకుడు

ఇదీ చదవండి: ఈ 5 వ్యాయామాలతో వృద్ధులు సూపర్ ఫిట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.