భారత్లో కరోనా కేసుల్లో కాస్త తగ్గుదల కనిపించింది. కొత్తగా 46,964 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 470 మంది కొవిడ్కు బలయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
![46,964 #Covid-19 cases and 470 death reported in India](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9386967_covid-19-telugu.jpg)
ఇప్పటివరకు 74 లక్షల 91 వేల మందికిపైగా కోలుకున్నారు. ఫలితంగా రికవరీ రేటు 91.54శాతానికి చేరింది. మరణాల రేటు 1.49 శాతానికి క్షీణించింది.
![46,964 #Covid-19 cases and 470 death reported in India](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9386967_indian-tracker-01-nov.jpg)
శనివారం ఒక్కరోజే 10 లక్షల 91 వేల కొవిడ్ నమూనాలను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 10 కోట్ల 98 లక్షల 87 వేలు దాటిందని ఐసీఎంఆర్ తెలిపింది.
ఇదీ చూడండి: ఇమార్తీ దేవీకి ఈసీ షాక్- ప్రచారంపై నిషేధం