ETV Bharat / bharat

ఒకే ఇంట్లో నలుగురి ఆత్మహత్య- ఏం జరిగిందంటే?

author img

By

Published : Aug 18, 2020, 6:46 AM IST

రాజస్థాన్​ కరౌలీ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుంజెలా గ్రామంలో ఓ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

FAMILY SUICIDE
ఒకే ఇంట్లో నలుగురి ఆత్మహత్య

రాజస్థాన్​ కరౌలీ జిల్లా కుంజెలాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలోని నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామంలోని ఓ ఇంటి నుంచి దుర్వాసన రాగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంట్లో భర్త, భార్య, ఇద్దరు పిల్లల మృతదేహాలను గుర్తించారు. ఇంటి యజమాని మహేంద్ర మహావర్​ ఫ్యాన్​కు ఉరి వేసుకుని ఉండగా.. లోపలి గదిలో అతని భార్య, ఇద్దరి పిల్లల మృతదేహాలు ఉన్నాయి.

వీరు కనీసం 3,4 రోజుల కింద చనిపోయినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. స్థానికులను విచారించిన అనంతరం ఈ మరణాలకు గృహహింసే కారణమని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు.

ఇదీ చూడండి: సర్పంచ్​ పట్ల కుల వివక్ష- పతాక ఆవిష్కరణకు నిరాకరణ

రాజస్థాన్​ కరౌలీ జిల్లా కుంజెలాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలోని నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామంలోని ఓ ఇంటి నుంచి దుర్వాసన రాగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంట్లో భర్త, భార్య, ఇద్దరు పిల్లల మృతదేహాలను గుర్తించారు. ఇంటి యజమాని మహేంద్ర మహావర్​ ఫ్యాన్​కు ఉరి వేసుకుని ఉండగా.. లోపలి గదిలో అతని భార్య, ఇద్దరి పిల్లల మృతదేహాలు ఉన్నాయి.

వీరు కనీసం 3,4 రోజుల కింద చనిపోయినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. స్థానికులను విచారించిన అనంతరం ఈ మరణాలకు గృహహింసే కారణమని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు.

ఇదీ చూడండి: సర్పంచ్​ పట్ల కుల వివక్ష- పతాక ఆవిష్కరణకు నిరాకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.