కర్ణాటక దేవనగరె జిల్లా, జగలూరు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ ట్యాంకర్.. లారీని ఢీకొనడం వల్ల రెండు వాహనాలూ మంటల్లో కాలిపోయాయి. ఈ ఘటనలో వాహనాల్లో ఉన్న ముగ్గురు సజీవ దహనమయ్యారు.
నిన్న రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురిలో.. గుజరాత్కు చెందిన రమేశ్, లాడూ రామ్ అనే ఇద్దరిని పోలీసులు గుర్తించగా, మరొకరి పేరు తెలియాల్సి ఉంది. అయితే లారీ.. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందినదిగా తెలుస్తోంది.
ఇదీ చదవండి:గ్రహణంపై మోదీ ట్వీట్- 'మీమ్ ఆర్టిస్ట్'కు అదిరే పంచ్