ETV Bharat / bharat

దిల్లీలో 29% ప్రజల్లో కరోనా యాంటీబాడీలు! - దిల్లీ ఆరోగ్యశాఖ

దేశ రాజధాని దిల్లీలో సుమారు 29 శాతం మంది కరోనా ప్రభావానికి లోనైనట్లు తాజా సర్వేలో తేలింది. ఈ నెల మొదటి వారంలో చేపట్టిన రెండో దఫా సెరోలాజికల్​ సర్వేలో 15 వేల మంది నమూనాలను పరీక్షించిన అధికారులు.. ఈ విషయాలను వెల్లడించారు.

29-percent-Delhi-has-Covid-Antibodies-says-Minister
దిల్లీలో 29 శాతం ప్రజలకు యాంటీబాడీలు
author img

By

Published : Aug 20, 2020, 3:05 PM IST

దిల్లీలో దాదాపు 29 శాతం ప్రజలు కొవిడ్‌-19 వైరస్‌ ప్రభావానికి గురైనట్లు దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ వెల్లడించారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు జరిపిన రెండో దఫా సెరోలాజికల్‌ సర్వేలో 29.1 శాతం ప్రజల్లో కొవిడ్‌ యాంటీబాడీలు వృద్ధిచెందినట్లు గుర్తించామని తెలిపారు. ఈ సర్వేలో 15 వేల మంది నమూనాలను పరీక్షించినట్లు సత్యేంద్ర జైన్‌ పేర్కొన్నారు.

దిల్లీలో వైరస్‌ ప్రభావాన్ని అంచనా వేయడంలో భాగంగా అక్కడి ప్రభుత్వం సెరోలాజికల్‌ సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వేను దిల్లీ ప్రభుత్వం జులైలో ఒకసారి చేపట్టగా.. ఇప్పుడు రెండోసారి నిర్వహించింది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లోనూ ఈ సర్వే నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో వైరస్‌ ప్రభావాన్ని అంచనా వేయడం, ముందస్తు చర్యలు తీసుకోవడంలో భాగంగా పలు ప్రాంతాల్లో ఈ సర్వేలు చేపట్టనున్నారు.

సర్వే చేస్తారిలా..

  • ఇన్ఫెక్షన్ బారినపడిన వారిలో కనిపించే యాంటీబాడీల స్థాయిని ఈ సెరోలాజికల్ సర్వే ద్వారా అంచనా వేస్తారు.
  • సెరోలాజికల్ సర్వేలో ప్రజలకు రక్త పరీక్షలు నిర్వహించి శరీరంలోని యాంటీబాడీల స్థాయిని గుర్తిస్తారు.
  • ర్యాండమ్‌గా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో అక్కడివారి అనుమతితో రక్త నమూనాలు సేకరించి పరీక్షిస్తారు.
  • తొలి దశలో జరిపిన సర్వేలో దిల్లీలో దాదాపు 22శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారు.

ఇదీ చదవండి: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరమిదే..

దిల్లీలో దాదాపు 29 శాతం ప్రజలు కొవిడ్‌-19 వైరస్‌ ప్రభావానికి గురైనట్లు దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ వెల్లడించారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు జరిపిన రెండో దఫా సెరోలాజికల్‌ సర్వేలో 29.1 శాతం ప్రజల్లో కొవిడ్‌ యాంటీబాడీలు వృద్ధిచెందినట్లు గుర్తించామని తెలిపారు. ఈ సర్వేలో 15 వేల మంది నమూనాలను పరీక్షించినట్లు సత్యేంద్ర జైన్‌ పేర్కొన్నారు.

దిల్లీలో వైరస్‌ ప్రభావాన్ని అంచనా వేయడంలో భాగంగా అక్కడి ప్రభుత్వం సెరోలాజికల్‌ సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వేను దిల్లీ ప్రభుత్వం జులైలో ఒకసారి చేపట్టగా.. ఇప్పుడు రెండోసారి నిర్వహించింది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లోనూ ఈ సర్వే నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో వైరస్‌ ప్రభావాన్ని అంచనా వేయడం, ముందస్తు చర్యలు తీసుకోవడంలో భాగంగా పలు ప్రాంతాల్లో ఈ సర్వేలు చేపట్టనున్నారు.

సర్వే చేస్తారిలా..

  • ఇన్ఫెక్షన్ బారినపడిన వారిలో కనిపించే యాంటీబాడీల స్థాయిని ఈ సెరోలాజికల్ సర్వే ద్వారా అంచనా వేస్తారు.
  • సెరోలాజికల్ సర్వేలో ప్రజలకు రక్త పరీక్షలు నిర్వహించి శరీరంలోని యాంటీబాడీల స్థాయిని గుర్తిస్తారు.
  • ర్యాండమ్‌గా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో అక్కడివారి అనుమతితో రక్త నమూనాలు సేకరించి పరీక్షిస్తారు.
  • తొలి దశలో జరిపిన సర్వేలో దిల్లీలో దాదాపు 22శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారు.

ఇదీ చదవండి: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరమిదే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.