ETV Bharat / bharat

తమిళనాడులో కరోనా ఉగ్రరూపం.. దిల్లీలో తగ్గుముఖం - Covid 19 death toll news

భారత్​లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర్​ప్రదేశ్​ సహా పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అయితే.. దిల్లీలో కొన్ని రోజులుగా ఒక్కరోజులో నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.

24 more die of coronavirus in UP, toll now 1,108; 1,673 new infections push caseload to 47,036
తమిళనాడులో కరోనా ఉగ్రరూపం.. దేశంలో పెరుగుతున్న కేసులు
author img

By

Published : Jul 18, 2020, 7:22 PM IST

దేశంలో కరోనా రోజురోజుకూ ఉద్ధృతం అవుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో వైరస్​ బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

తమిళనాడులో వైరస్​ కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఒక్కరోజే 4,807 మంది కరోనా బారినపడ్డారు. మరో 88 మంది మృతి చెందారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 1,65,714కు చేరగా... 2,403 మంది కరోనాతో చనిపోయారు.

ఉత్తర్​ప్రదేశ్​లోనూ మహమ్మారి విస్తరిస్తోంది. శనివారం మరో 1,673 మందికి వైరస్​ సోకింది. 24 మందికిపైగా మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 47,036 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 1,108కు చేరింది.

రాజధానిలో తగ్గుముఖం..

దిల్లీలో కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 1,475 కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,21,582కు పెరిగింది. మరో 26మంది మహమ్మారికి బలయ్యారు. దేశరాజధానిలో మొత్తం 3597 మరణాలు నమోదయ్యాయి.

కేరళలో తాజాగా 593మందికి కరోనా పాజిటివ్​గా​ తేలింది. మొత్తం కేసులు 11,659కు, మరణాలు 173కు పెరిగాయి.

ఇదీ చూడండి: భాజపా కార్యకర్తలపై తృణమూల్​ సభ్యుల దాడి

దేశంలో కరోనా రోజురోజుకూ ఉద్ధృతం అవుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో వైరస్​ బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

తమిళనాడులో వైరస్​ కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఒక్కరోజే 4,807 మంది కరోనా బారినపడ్డారు. మరో 88 మంది మృతి చెందారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 1,65,714కు చేరగా... 2,403 మంది కరోనాతో చనిపోయారు.

ఉత్తర్​ప్రదేశ్​లోనూ మహమ్మారి విస్తరిస్తోంది. శనివారం మరో 1,673 మందికి వైరస్​ సోకింది. 24 మందికిపైగా మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 47,036 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 1,108కు చేరింది.

రాజధానిలో తగ్గుముఖం..

దిల్లీలో కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 1,475 కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,21,582కు పెరిగింది. మరో 26మంది మహమ్మారికి బలయ్యారు. దేశరాజధానిలో మొత్తం 3597 మరణాలు నమోదయ్యాయి.

కేరళలో తాజాగా 593మందికి కరోనా పాజిటివ్​గా​ తేలింది. మొత్తం కేసులు 11,659కు, మరణాలు 173కు పెరిగాయి.

ఇదీ చూడండి: భాజపా కార్యకర్తలపై తృణమూల్​ సభ్యుల దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.