ETV Bharat / bharat

మూడేళ్లలో 216 మంది నక్సల్స్​ ఎన్​కౌంటర్​

author img

By

Published : Dec 23, 2020, 8:14 PM IST

గత మూడేళ్లలో ఛత్తీస్​గఢ్​​లో జరిగిన ఎదురుకాల్పుల్లో 216 మంది మావోయిస్టులు హతమయ్యారు. అందులో సుక్మా జిల్లాలోనే ఎక్కువ మంది నక్సల్స్​ చనిపోయారని వెల్లడించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.

216 Naxals killed in encounters in Chhattisgarh in 3 yrs: Govt
మూడేళ్లలో ఛత్తీస్​గఢ్​లో 216 మంది నక్సల్​ హతం

ఛత్తీస్​గఢ్​​లో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో 2018 నుంచి 2020, నవంబర్​ 30 వరకు 216 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు.. మూడేళ్లలో 966 మంది మావోయిస్టులు లొంగిపోయారని పేర్కొంది.

ఈ మేరకు కాంగ్రెస్​ ఎమ్మెల్యే ధనేంద్ర సాహు అడిగిన ప్రశ్నకు హోంమంత్రి తమ్రధ్వాజ్​​ సాహు ఛత్తీస్​గఢ్​ శాసనసభలో రాతపూర్వక వివరణ ఇచ్చారు.

శాసనసభకు సమర్పించిన వివరాలు ప్రకారం.. సుక్మా జిల్లాలో అత్యధికంగా 82 మంది నక్సల్స్​ హతమవగా.. ఇదే జిల్లాలో 333 మంది లొంగిపోయారు. అయితే అత్యల్పంగా కబీర్​ధామ్​ జిల్లాలో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారని వెల్లడించారు.

ఇదీ చూడండి: ఛత్తీస్​గఢ్​లో నక్సల్స్​ దుశ్చర్య.. పలు వాహనాలకు నిప్పు

ఛత్తీస్​గఢ్​​లో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో 2018 నుంచి 2020, నవంబర్​ 30 వరకు 216 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు.. మూడేళ్లలో 966 మంది మావోయిస్టులు లొంగిపోయారని పేర్కొంది.

ఈ మేరకు కాంగ్రెస్​ ఎమ్మెల్యే ధనేంద్ర సాహు అడిగిన ప్రశ్నకు హోంమంత్రి తమ్రధ్వాజ్​​ సాహు ఛత్తీస్​గఢ్​ శాసనసభలో రాతపూర్వక వివరణ ఇచ్చారు.

శాసనసభకు సమర్పించిన వివరాలు ప్రకారం.. సుక్మా జిల్లాలో అత్యధికంగా 82 మంది నక్సల్స్​ హతమవగా.. ఇదే జిల్లాలో 333 మంది లొంగిపోయారు. అయితే అత్యల్పంగా కబీర్​ధామ్​ జిల్లాలో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారని వెల్లడించారు.

ఇదీ చూడండి: ఛత్తీస్​గఢ్​లో నక్సల్స్​ దుశ్చర్య.. పలు వాహనాలకు నిప్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.