ETV Bharat / bharat

అయ్యప్ప దర్శనానికి 12 ఏళ్ల బాలిక యత్నం- అడ్డుకున్న పోలీసులు

author img

By

Published : Nov 19, 2019, 3:31 PM IST

అయ్యప్ప దర్శనం కోసం వచ్చిన పన్నెండేళ్ల బాలికను పోలీసులు అడ్డగించారు. ఆధార్​ కార్డు తనిఖీలో బాలిక వయసును పన్నెండేళ్లుగా గుర్తించి పంబా నుంచి తిరిగి పంపించారు. మరోవైపు ఆలయ సంప్రదాయాలను కాపాడాలని ఓ బాలిక వినూత్న ప్రయత్నం చేసింది. మళ్లీ 50 ఏళ్లు వచ్చిన తర్వాతే దర్శనానికి వస్తానని ప్లకార్డు ప్రదర్శించింది.

అయ్యప్ప దర్శనానికి 12 ఏళ్ల బాలిక యత్నం.. అడ్డుకున్న పోలీసులు

సుప్రీంకోర్టు శబరిమలకు మహిళలందరినీ అనుమతించిన నేపథ్యంలో పుదుచ్చేరికి చెందిన 12 ఏళ్ల బాలిక అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. అయితే తండ్రితో కలిసి స్వామిని దర్శించుకోవాలని చూసిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. బుకింగ్​ సమయంలో బాలిక వయసును తల్లితండ్రులు తప్పుగా నమోదు చేసినట్లు గుర్తించారు. చిన్నారి ఆధార్​ కార్డును తనిఖీ చేసిన పోలీసులు బాలిక వయసు 12 ఏళ్లని గుర్తించారు. ఫలితంగా ఆమెను పంబా నుంచి ముందుకు అనుమతించలేదు. ఆలయ పరిసరాల్లో తాజా పరిస్థితులను వివరించి.. బాలిక కుటుంబసభ్యులను మాత్రమే దర్శనానికి అనుమతించారు.

మళ్లీ యాభై ఏళ్లకు వస్తాను

శబరిమల పుణ్యక్షేత్ర ఆచారాన్ని పాటిస్తూ.. సంప్రదాయాలను కాపాడాలని కేరళకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక వినూత్న ప్రయత్నం చేసింది. మంగళవారం దర్శనానికై విచ్చేసిన ఆ బాలిక.. 50 ఏళ్లు వచ్చిన తర్వాతే మళ్లీ దర్శనానికి వస్తానని తన మెడలో ప్లకార్డు ధరించింది.

'వేచి చూడడానికి నేను సిద్ధమే. అయ్యప్ప దర్శనానికి 50 ఏళ్లు దాటిన తర్వాత మళ్లీ వస్తాను' అని ప్లకార్డులో ఉంది. ఆచారాలు, నమ్మకాలు పాటించేవారే నిజమైన భక్తులని బాలిక తండ్రి వ్యాఖ్యానించారు.

సోమవారం సైతం 10-50 ఏళ్ల మధ్య వయసున్న ఇద్దరిని ఆలయంలోకి పోలీసులు అనుమతించలేదు.

శబరిమలలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018, సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయినప్పటికీ భక్తులు మాత్రం మహిళలను అయ్యప్ప దర్శనానికి అనుమతించడం లేదు. ఆలయ సనాతన సంప్రదాయాలను కాపాడాలని మహిళలను కోరుతున్నారు.

సుప్రీంకోర్టు శబరిమలకు మహిళలందరినీ అనుమతించిన నేపథ్యంలో పుదుచ్చేరికి చెందిన 12 ఏళ్ల బాలిక అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. అయితే తండ్రితో కలిసి స్వామిని దర్శించుకోవాలని చూసిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. బుకింగ్​ సమయంలో బాలిక వయసును తల్లితండ్రులు తప్పుగా నమోదు చేసినట్లు గుర్తించారు. చిన్నారి ఆధార్​ కార్డును తనిఖీ చేసిన పోలీసులు బాలిక వయసు 12 ఏళ్లని గుర్తించారు. ఫలితంగా ఆమెను పంబా నుంచి ముందుకు అనుమతించలేదు. ఆలయ పరిసరాల్లో తాజా పరిస్థితులను వివరించి.. బాలిక కుటుంబసభ్యులను మాత్రమే దర్శనానికి అనుమతించారు.

మళ్లీ యాభై ఏళ్లకు వస్తాను

శబరిమల పుణ్యక్షేత్ర ఆచారాన్ని పాటిస్తూ.. సంప్రదాయాలను కాపాడాలని కేరళకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక వినూత్న ప్రయత్నం చేసింది. మంగళవారం దర్శనానికై విచ్చేసిన ఆ బాలిక.. 50 ఏళ్లు వచ్చిన తర్వాతే మళ్లీ దర్శనానికి వస్తానని తన మెడలో ప్లకార్డు ధరించింది.

'వేచి చూడడానికి నేను సిద్ధమే. అయ్యప్ప దర్శనానికి 50 ఏళ్లు దాటిన తర్వాత మళ్లీ వస్తాను' అని ప్లకార్డులో ఉంది. ఆచారాలు, నమ్మకాలు పాటించేవారే నిజమైన భక్తులని బాలిక తండ్రి వ్యాఖ్యానించారు.

సోమవారం సైతం 10-50 ఏళ్ల మధ్య వయసున్న ఇద్దరిని ఆలయంలోకి పోలీసులు అనుమతించలేదు.

శబరిమలలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018, సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయినప్పటికీ భక్తులు మాత్రం మహిళలను అయ్యప్ప దర్శనానికి అనుమతించడం లేదు. ఆలయ సనాతన సంప్రదాయాలను కాపాడాలని మహిళలను కోరుతున్నారు.

AP Video Delivery Log - 0700 GMT News
Sunday, 17 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0657: Hong Kong Protest Clashes 2 AP Clients Only 4240312
Student protesters vow to continue sit-in
AP-APTN-0625: Hong Kong Protest Battles AP Clients Only 4240310
HKong police, protesters engage in running battles
AP-APTN-0555: Cuba Havana Anniversary AP Clients Only 4240305
Gala event to mark Havana's 500th birthday
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.