ETV Bharat / bharat

ఒకే కుటుంబంలోని 12 మందికి కరోనా

author img

By

Published : Apr 24, 2020, 7:41 AM IST

దిల్లీలో కరోనా వైరస్​ వేగంగా విజృంభిస్తోంది. కంటైన్మెంట్​ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో కేసులు పెరిగిపోతున్నాయి. పాత దిల్లీలోని ఓ కంటైన్మెంట్​ ప్రాంతంలో 2 నెలల చిన్నారి సహా కుటుంబంలోని 12 మందికి వైరస్​ సోకింది. దేశ రాజధానిలో ఇప్పటివరకు 2376 మంది కరోనా బారినపడగా.. 50 మంది ప్రాణాలు కోల్పోయారు.

12 of family, including 2-month-old infant test positive
ఒకే కుటుంబంలోని 12 మందికి కరోనా

కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వ్యాప్తికి అడ్డుకట్ట పడటం లేదు. దిల్లీలో వైరస్​ విస్తృతి దృష్ట్యా పలు ప్రాంతాలను కంటైన్మెంట్​ జోన్లుగా ప్రకటించి.. ఇళ్లలోంచి ప్రజలను బయటకు రానివ్వడం లేదు. అయినప్పటికీ వైరస్​ విజృంభిస్తూనే ఉంది.

పాత దిల్లీలోని ఓ కంటైన్మెంట్​ జోన్​లో ఒకే కుటుంబంలోని 12 మందికి కరోనా నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 2 నెలల చిన్నారి కూడా ఉండటం గమనార్హం. వీరందరినీ ఎల్​ఎన్​జీపీ ఆస్పత్రికి పంపించినట్లు వెల్లడించారు.

నిర్లక్ష్యంతోనే..

గత నెలలో ఇదే కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఉజ్బెకిస్థాన్​ నుంచి స్వదేశానికి వచ్చాడు. అయితే.. అధికారులకు సమాచారం అందించలేదు. అనంతరం.. కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా పాజిటివ్​గా తేలింది. ఛురివలన్​లో నివాసం ఉండే ఈ వ్యక్తి కుటుంబంలోని మిగతా 11 మందికీ తర్వాత కరోనా నిర్ధరణ అయినట్లు అధికారులు వెల్లడించారు.

వీరికి కరోనా ఉన్నట్లు తేలిన అనంతరం.. ఈ కంటైన్మెంట్​ జోన్​లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలను మరింత కఠినతరం​ చేశారు.

దిల్లీ జహంగీర్​పురీ ప్రాంతంలో ఇటీవల ఒకే కుటుంబంలోని 31 మందికి కరోనా సోకింది. ఇందులోనూ చిన్నపిల్లలున్నారు.

దేశరాజధానిలో మొత్తం కరోనా కేసులు 2376కు చేరగా.. ఇప్పటివరకు 50 మంది మరణించారు.

కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వ్యాప్తికి అడ్డుకట్ట పడటం లేదు. దిల్లీలో వైరస్​ విస్తృతి దృష్ట్యా పలు ప్రాంతాలను కంటైన్మెంట్​ జోన్లుగా ప్రకటించి.. ఇళ్లలోంచి ప్రజలను బయటకు రానివ్వడం లేదు. అయినప్పటికీ వైరస్​ విజృంభిస్తూనే ఉంది.

పాత దిల్లీలోని ఓ కంటైన్మెంట్​ జోన్​లో ఒకే కుటుంబంలోని 12 మందికి కరోనా నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 2 నెలల చిన్నారి కూడా ఉండటం గమనార్హం. వీరందరినీ ఎల్​ఎన్​జీపీ ఆస్పత్రికి పంపించినట్లు వెల్లడించారు.

నిర్లక్ష్యంతోనే..

గత నెలలో ఇదే కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఉజ్బెకిస్థాన్​ నుంచి స్వదేశానికి వచ్చాడు. అయితే.. అధికారులకు సమాచారం అందించలేదు. అనంతరం.. కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా పాజిటివ్​గా తేలింది. ఛురివలన్​లో నివాసం ఉండే ఈ వ్యక్తి కుటుంబంలోని మిగతా 11 మందికీ తర్వాత కరోనా నిర్ధరణ అయినట్లు అధికారులు వెల్లడించారు.

వీరికి కరోనా ఉన్నట్లు తేలిన అనంతరం.. ఈ కంటైన్మెంట్​ జోన్​లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలను మరింత కఠినతరం​ చేశారు.

దిల్లీ జహంగీర్​పురీ ప్రాంతంలో ఇటీవల ఒకే కుటుంబంలోని 31 మందికి కరోనా సోకింది. ఇందులోనూ చిన్నపిల్లలున్నారు.

దేశరాజధానిలో మొత్తం కరోనా కేసులు 2376కు చేరగా.. ఇప్పటివరకు 50 మంది మరణించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.