దిల్లీలోని నవాబ్గంజ్ ప్రాంతానికి చెందిన 106ఏళ్ల ముక్తార్ అహ్మద్.. కరోనా వైరస్ బారిన పడి 17 రోజుల్లోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఏప్రిల్ 14న కరోనా లక్షణాలతో రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. చికిత్స అనంతరం వైద్య పరీక్షలు నిర్వహంచగా రెండు సార్లు నెగిటివ్ వచ్చింది. మే 1న అతన్ని ఇంటికి పంపారు వైద్యులు.
మొదట ముక్తార్ కుమారునికి వైరస్ సోకగా, ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ మహమ్మారి బారిన పడ్డారు.
"మొదట మా నాన్నకు పాజిటివ్గా తేలింది. ఆ తర్వాత మా అమ్మ, సోదరుడు, తాతలకు వైరస్ సోకింది. అందరం కోలుకున్నాం. ప్రస్తుతం మా నాన్న ఒక్కరే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. త్వరలో ఆయన కూడా కోలుకుంటారని ఆశిస్తున్నాం."
-ముక్తార్ మనవడు