కర్ణాటక హవేరి జిల్లా రాణిబెన్నూరులోని వందేమాతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకచవితి సందర్భంగా 10 కిలోల వెండి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ గణేశ్ ప్రతిమ చుట్టూ 500 కిలోల వివిధ రకాల పువ్వులను అలంకరించారు. బంగారం రంగుతో కూడిన కొబ్బరికాయలు, అరటి చెట్లతో మంటపాన్ని ముస్తాబు చేశారు.
ఏటా.. ఈ వందేమాతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తారు. దీనికి 'రాణిబెన్నూరు కా రాజా' అని పేరు పెట్టుకున్నారు.