ETV Bharat / bharat

'బంగాల్​కు కావాల్సింది తమ సొంత కూతురే'

author img

By

Published : Feb 20, 2021, 4:23 PM IST

భాజపా వర్గాలను బయటి వ్యక్తులుగా అభివర్ణిస్తున్న తృణమూల్ కాంగ్రెస్.. 'బంగాల్​కు కావాల్సింది తమ సొంత కూతురే' అనే నినాదంతో ఆ రాష్ట్రంలో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఈ నినాదంతో కోల్​కతాలో భారీగా హోర్డింగ్​లను ఏర్పాటు చేసింది.

'Bengal wants its own daughter': TMC launches poll slogan
'బంగాల్​కు కావాల్సింది తమ సొంత కూతురే'

బంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ ఆసక్తికర నినాదాన్ని ఎంచుకుంది. సీఎం మమతా బెనర్జీని బంగాల్ ముద్దుబిడ్డగా పేర్కొంటూ.. 'బంగ్లా నిజర్ మెయెకై చాయే' పేరుతో ప్రచారాన్ని నిర్వహిస్తోంది. 'బంగాల్​కు కావాల్సింది సొంత కూతురే' అని దీనర్థం.

టీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద దీదీ ఫొటోలతో పాటు నినాదాలు కూడిన హోర్డింగులను ఏర్పాటు చేశారు పార్టీ కార్యకర్తలు. రాజధాని కోల్​కతా వ్యాప్తంగానూ వీటిని నెలకొల్పుతున్నారు.

"ముఖ్యమంత్రిగా గత కొన్నేళ్ల నుంచి తమ వెంటే మమతను బంగాల్ ప్రజలు కోరుకుంటున్నారు. తమ సొంత బిడ్డనే వారు కావాలని అనుకుంటున్నారు. బంగాల్​లో ఇతర వ్యక్తుల ఆధిపత్యాన్ని మేం కోరుకోవట్లేదు."

-పార్థా చటర్జీ, టీఎంసీ ప్రధాన కార్యదర్శి

దీదీ, భాజపా నేతల మధ్య మాటల యుద్ధంతో ఇప్పటికే బంగాల్​లో రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. భాజపా నేతలను బయటి వ్యక్తులుగా అభివర్ణిస్తున్నారు దీదీ. మమత పాలనకు చరమగీతం పాడాలని భాజపా ప్రచారం చేస్తోంది.

భారీగా కేంద్ర బలగాలు

మరోవైపు, ఎన్నికలకు సిద్ధమవుతున్న బంగాల్​లో భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు అధికారులు. 12 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు సిబ్బంది(సీఏపీఎఫ్) బలగాలను రాష్ట్రానికి పంపించారు. డాన్​కునీకి ఐదు కంపెనీలు, కోల్​కతాకు నాలుగు కంపెనీలు, దుర్గాపుర్​కు రెండు కంపెనీల దళాలు చేరుకున్నాయని తెలిపారు. బుర్ద్వాన్​కు ఒక కంపెనీ సీఆర్​పీఎఫ్ సిబ్బంది చేరుకున్నారని చెప్పారు.

ఫిబ్రవరి 25 నాటికి 125 కంపెనీల కేంద్ర బలగాలను బంగాల్​లో మోహరించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. 60 కంపెనీల సీఆర్​పీఎఫ్, 30 కంపెనీల సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్​బీ), ఐదు కంపెనీల చొప్పున సీఐఎస్ఎఫ్, ఇండోటిబెటన్ సరిహద్దు పోలీసుల బృందాలు మరికొన్ని రోజుల్లో రాష్ట్రానికి చేరుకుంటాయని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: కేరళలో భాజపా ఆశలన్నీ 'మెట్రోమ్యాన్​' పైనే!

బంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ ఆసక్తికర నినాదాన్ని ఎంచుకుంది. సీఎం మమతా బెనర్జీని బంగాల్ ముద్దుబిడ్డగా పేర్కొంటూ.. 'బంగ్లా నిజర్ మెయెకై చాయే' పేరుతో ప్రచారాన్ని నిర్వహిస్తోంది. 'బంగాల్​కు కావాల్సింది సొంత కూతురే' అని దీనర్థం.

టీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద దీదీ ఫొటోలతో పాటు నినాదాలు కూడిన హోర్డింగులను ఏర్పాటు చేశారు పార్టీ కార్యకర్తలు. రాజధాని కోల్​కతా వ్యాప్తంగానూ వీటిని నెలకొల్పుతున్నారు.

"ముఖ్యమంత్రిగా గత కొన్నేళ్ల నుంచి తమ వెంటే మమతను బంగాల్ ప్రజలు కోరుకుంటున్నారు. తమ సొంత బిడ్డనే వారు కావాలని అనుకుంటున్నారు. బంగాల్​లో ఇతర వ్యక్తుల ఆధిపత్యాన్ని మేం కోరుకోవట్లేదు."

-పార్థా చటర్జీ, టీఎంసీ ప్రధాన కార్యదర్శి

దీదీ, భాజపా నేతల మధ్య మాటల యుద్ధంతో ఇప్పటికే బంగాల్​లో రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. భాజపా నేతలను బయటి వ్యక్తులుగా అభివర్ణిస్తున్నారు దీదీ. మమత పాలనకు చరమగీతం పాడాలని భాజపా ప్రచారం చేస్తోంది.

భారీగా కేంద్ర బలగాలు

మరోవైపు, ఎన్నికలకు సిద్ధమవుతున్న బంగాల్​లో భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు అధికారులు. 12 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు సిబ్బంది(సీఏపీఎఫ్) బలగాలను రాష్ట్రానికి పంపించారు. డాన్​కునీకి ఐదు కంపెనీలు, కోల్​కతాకు నాలుగు కంపెనీలు, దుర్గాపుర్​కు రెండు కంపెనీల దళాలు చేరుకున్నాయని తెలిపారు. బుర్ద్వాన్​కు ఒక కంపెనీ సీఆర్​పీఎఫ్ సిబ్బంది చేరుకున్నారని చెప్పారు.

ఫిబ్రవరి 25 నాటికి 125 కంపెనీల కేంద్ర బలగాలను బంగాల్​లో మోహరించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. 60 కంపెనీల సీఆర్​పీఎఫ్, 30 కంపెనీల సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్​బీ), ఐదు కంపెనీల చొప్పున సీఐఎస్ఎఫ్, ఇండోటిబెటన్ సరిహద్దు పోలీసుల బృందాలు మరికొన్ని రోజుల్లో రాష్ట్రానికి చేరుకుంటాయని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: కేరళలో భాజపా ఆశలన్నీ 'మెట్రోమ్యాన్​' పైనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.