బంగాల్లో మూడోదశ పోలింగ్ నేపథ్యంలో ఆరంబాగ్లో తృణమూల్ కాంగ్రెస్, భాజపా కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మహిళా ఓటర్లను భాజపా కార్యకర్తలు బెదిరిస్తున్నారని, వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరంబాగ్ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సుజాత మోండల్ ఆరోపించారు.
" అరంది-ఐ ప్రాంతంలో మమతా బెనర్జీని అభిమానించే మైనారిటీ ఓటర్లు ఉన్నారు. భాజపా కార్యకర్తలు గత రాత్రి మహిళా ఓటర్లను వేధించారు. వారితో అసభ్యంగా ప్రవర్తించారు. బటనాల్లోని 45వ పోలింగ్ కేంద్రంలో ఓటర్లు తృణమూల్ కాంగ్రెస్కు ఓటేస్తే భాజపాకు వెళ్తోంది. హింసతో భాజపా గెలవాలని చూస్తోంది. "
-- సుజాత మోండల్ ఖాన్, ఆరంబాగ్ టీఎంసీ అభ్యర్థి
సీఆర్పీఎఫ్ బలగాలు సైతం భాజపాకు మద్దతుగా వ్యవహరిస్తున్నాయని సుజాత ఆరోపించారు.
బంగాల్ మూడో దశ ఎన్నికల్లో భాగంగా 31 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది.
ఇదీ చదవండి : అసెంబ్లీ ఎన్నికలు: జోరుగా పోలింగ్- ఓటేస్తున్న ప్రముఖులు