ETV Bharat / bharat

అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు!

author img

By

Published : Dec 1, 2021, 3:11 PM IST

Updated : Dec 1, 2021, 5:58 PM IST

international flights ban: అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణను మరోమారు వాయిదా వేసింది డీజీసీఏ. ఎప్పటి నుంచి అనుమతిస్తారనే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామని పేర్కొంది.

INTERNATIONAL FLIGHTS
అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు!

international flights ban: అంతర్జాతీయ విమానాలను డిసెంబర్​ 15 నుంచి పునరుద్ధరించాలనే నిర్ణయం అమలును వాయిదా వేసింది పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ. కరోనా కొత్త వేరియంట్​ వెలుగు చూసిన క్రమంలో అంతర్జాతీయంగా పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

" కరోనా కొత్త వేరియంట్​ వెలుగు చూసిన క్రమంలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. విమానాల పునరుద్ధరణకు సంబంధించి స్పష్టమైన తేదీని త్వరలోనే ప్రకటిస్తాం. "

- డీజీసీఏ.

కరోనా మహమ్మారి విజృంభణతో అంతర్జాతీయ విమానాల రాకపోకలు 2020, మార్చి 23 నుంచి నిలిపివేసింది భారత్​. ఇటీవల కోవిడ్​ ఉద్ధృతి తగ్గగా.. డిసెంబర్​ 15 నుంచి పూర్తిస్థాయిలో అనుమతించాలని గత నెలలో నిర్ణయించింది. అయితే.. తాజా నిర్ణయంతో మరిన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం ఏర్పడింది.

ప్రధాని సమీక్ష..

ఒమిక్రాన్​ వేరియంట్​ వెలుగు చూసిన క్రమంలో ఉన్నతాధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్​ 27న సమావేశమయ్యారు. అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల సడలింపును పునఃసమీక్షించాలని ప్రధాని సూచించారు. మరుసటి రోజునే ప్రయాణ ఆంక్షల సడలింపు నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మోదీ సూచనల మేరకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని అధికారవర్గాలు భావిస్తున్నాయి.

భారత్​లో ఇప్పటి వరకు ఒమిక్రాన్​ కేసులు నమోదు కాలేదు. అయినప్పటికీ, అంతర్జాతీయ ప్రయాణికులకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు అధికారులు.

పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పౌర విమానయాన మంత్రి జోతిరాదిత్య సింధియా నవంబర్​ 29న తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ, మహమ్మారి పరిస్థితులు, ప్రజల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి విమానాల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకున్నట్లు రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు మంత్రి. అయితే, తాజా అత్యవసర పరిస్థితులు దృష్ట్యా ఆ నిర్ణయంపై పునఃసమీక్షిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా

international flights ban: అంతర్జాతీయ విమానాలను డిసెంబర్​ 15 నుంచి పునరుద్ధరించాలనే నిర్ణయం అమలును వాయిదా వేసింది పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ. కరోనా కొత్త వేరియంట్​ వెలుగు చూసిన క్రమంలో అంతర్జాతీయంగా పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

" కరోనా కొత్త వేరియంట్​ వెలుగు చూసిన క్రమంలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. విమానాల పునరుద్ధరణకు సంబంధించి స్పష్టమైన తేదీని త్వరలోనే ప్రకటిస్తాం. "

- డీజీసీఏ.

కరోనా మహమ్మారి విజృంభణతో అంతర్జాతీయ విమానాల రాకపోకలు 2020, మార్చి 23 నుంచి నిలిపివేసింది భారత్​. ఇటీవల కోవిడ్​ ఉద్ధృతి తగ్గగా.. డిసెంబర్​ 15 నుంచి పూర్తిస్థాయిలో అనుమతించాలని గత నెలలో నిర్ణయించింది. అయితే.. తాజా నిర్ణయంతో మరిన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం ఏర్పడింది.

ప్రధాని సమీక్ష..

ఒమిక్రాన్​ వేరియంట్​ వెలుగు చూసిన క్రమంలో ఉన్నతాధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్​ 27న సమావేశమయ్యారు. అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల సడలింపును పునఃసమీక్షించాలని ప్రధాని సూచించారు. మరుసటి రోజునే ప్రయాణ ఆంక్షల సడలింపు నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మోదీ సూచనల మేరకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని అధికారవర్గాలు భావిస్తున్నాయి.

భారత్​లో ఇప్పటి వరకు ఒమిక్రాన్​ కేసులు నమోదు కాలేదు. అయినప్పటికీ, అంతర్జాతీయ ప్రయాణికులకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు అధికారులు.

పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పౌర విమానయాన మంత్రి జోతిరాదిత్య సింధియా నవంబర్​ 29న తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ, మహమ్మారి పరిస్థితులు, ప్రజల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి విమానాల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకున్నట్లు రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు మంత్రి. అయితే, తాజా అత్యవసర పరిస్థితులు దృష్ట్యా ఆ నిర్ణయంపై పునఃసమీక్షిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా

Last Updated : Dec 1, 2021, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.