ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లా సిసౌలీ గ్రామంలో భాజపా ఎమ్మెల్యే ఉమేశ్ మాలిక్పై దాడి జరిగింది. పదుల సంఖ్యలో నిరసనకారులు ఎమ్మెల్యే వాహనాన్ని చుట్టుముట్టారు. కారుపై సిరా చల్లి, రాళ్లతో వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన జరిగిన ప్రదేశం రైతు నేత రాకేశ్ టికాయిత్ స్వగ్రామం కావడం గమనార్హం.
సిసౌలీలోని జనకల్యాణ్ సమితి వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యేను నిరసనకారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాహనాన్ని ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే, అతని బృందం అక్కడి నుంచి తప్పించుకుని.. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారు బీకేయూ నేతలని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి : విదేశీ జంటను భారత రాజ్యాంగం కలిపిందిలా!