ETV Bharat / bharat

చైనాకు మన భూభాగాన్ని వదులుకోలేదు: కేంద్రం

author img

By

Published : Feb 12, 2021, 4:08 PM IST

Updated : Feb 12, 2021, 5:37 PM IST

భారత్​-చైనా సరిహద్దులోని పాంగాంగ్​ సరస్సు వద్ద భారత భూభాగం ఫింగర్​ 4 వరకు లేదని స్పష్టం చేసింది రక్షణ మంత్రిత్వ శాఖ. చైనాతో ఒప్పందం తర్వాత.. భారత భూభాగాన్ని వదులుకోలేదని తెలిపింది. అంతకుముందు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాందీ.. భారత భూభాగం ఫింగర్​ 4 వరకు ఉందని, చైనాకు మన భూభాగాన్ని అప్పగించిందని ఆరోపించారు.

Assertion that Indian territory is up to Finger 4 in Pangong Tso area
ఫింగర్​ 4 వరకూ భారత భూభాగం లేదు: రక్షణ శాఖ

చైనాతో ఒప్పందం ప్రకారం.. మోదీ సర్కారు భారత భూభాగాన్ని ఆ దేశానికి అప్పగించిందని కాంగ్రెస్​ చేసిన ఆరోపణలను రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. బలగాల ఉపసంహరణ సందర్భంగా.. తమ భూభాగాన్ని చైనాకు వదులుకోలేదని నొక్కిచెప్పింది. పాంగాంగ్​ సరస్సు వద్ద భారత భూభాగం ఫింగర్​ 4 వరకు ఉందన్నది అవాస్తవం అని స్పష్టం చేసింది.

తప్పుడు ఆరోపణలతో సైన్యం త్యాగాలను అవమానించవద్దని కాంగ్రెస్​కు హితవు పలికింది.

''సైన్యం త్యాగాలతో సాధించిన విజయాలను అవమానించడమంటే.. వారిని అగౌరవపర్చడమే. 1962 నుంచి 43వేల చదరపు కిలోమీటర్లకుపైగా భారత భూభాగం చైనా ఆక్రమణలో ఉన్నట్లు మన మ్యాప్‌లోనూ స్పష్టంగా ఉంది. అందుకే మన భూభాగంపై చైనాతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు.''

- రక్షణ శాఖ ప్రకటన

దేశ ప్రయోజనాలు ప్రాంతీయ పరిరక్షణకు దృఢ సంకల్పంతో ఉన్నామని తేల్చిచెప్పిన రక్షణ శాఖ.. సైన్యం శక్తి సామర్థ్యాలపై తమ ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని నొక్కిచెప్పింది. భారత్​ అంచనా ప్రకారం.. వాస్తవాధీన రేఖ కూడా ఫింగర్​ 8 వద్దే ఉందని, ఫింగర్​ 4 వద్ద కాదని ఓ ప్రకటన వెలువరించింది. అందుకే.. ఫింగర్​ 8 వరకు పెట్రోలింగ్​ నిర్వహించే హక్కు భారత్​కు ఉందని చైనాకు స్పష్టం చేసినట్లు వివరించింది.

పాంగాంగ్​ త్సో ఉత్తర ఒడ్డున భారత్​, చైనా శాశ్వత శిబిరాలు ఎప్పటినుంచో ఉన్నాయని తెలిపింది. మన స్థావరం ఫింగర్‌ 3 వద్ద ఉండగా, చైనాది ఫింగర్‌ 8 వద్ద ఉందని గుర్తుచేసింది రక్షణ శాఖ. ఇరుదేశాల బలగాలు ముందుకు రాకుండా ఎవరి స్థావరాల వద్ద వారు ఉండేలా ప్రస్తుత ఒప్పందం జరిగిందని తెలిపింది.

అంతకుముందు.. ఫింగర్‌ 4 మన భూభాగంలో ఉంటే ఫింగర్‌ 3 వరకు వెనక్కి రావడం ద్వారా మోదీ సర్కారు దేశ భూభాగాన్ని చైనాకు ఇచ్చేసిందని రాహుల్‌ విమర్శించారు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ పైవ్యాఖ్యలు చేసింది.

ఇదీ చూడండి: 'భారత భూభాగాన్ని చైనాకు అప్పగించిన ప్రధాని'

చైనాతో ఒప్పందం ప్రకారం.. మోదీ సర్కారు భారత భూభాగాన్ని ఆ దేశానికి అప్పగించిందని కాంగ్రెస్​ చేసిన ఆరోపణలను రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. బలగాల ఉపసంహరణ సందర్భంగా.. తమ భూభాగాన్ని చైనాకు వదులుకోలేదని నొక్కిచెప్పింది. పాంగాంగ్​ సరస్సు వద్ద భారత భూభాగం ఫింగర్​ 4 వరకు ఉందన్నది అవాస్తవం అని స్పష్టం చేసింది.

తప్పుడు ఆరోపణలతో సైన్యం త్యాగాలను అవమానించవద్దని కాంగ్రెస్​కు హితవు పలికింది.

''సైన్యం త్యాగాలతో సాధించిన విజయాలను అవమానించడమంటే.. వారిని అగౌరవపర్చడమే. 1962 నుంచి 43వేల చదరపు కిలోమీటర్లకుపైగా భారత భూభాగం చైనా ఆక్రమణలో ఉన్నట్లు మన మ్యాప్‌లోనూ స్పష్టంగా ఉంది. అందుకే మన భూభాగంపై చైనాతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు.''

- రక్షణ శాఖ ప్రకటన

దేశ ప్రయోజనాలు ప్రాంతీయ పరిరక్షణకు దృఢ సంకల్పంతో ఉన్నామని తేల్చిచెప్పిన రక్షణ శాఖ.. సైన్యం శక్తి సామర్థ్యాలపై తమ ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని నొక్కిచెప్పింది. భారత్​ అంచనా ప్రకారం.. వాస్తవాధీన రేఖ కూడా ఫింగర్​ 8 వద్దే ఉందని, ఫింగర్​ 4 వద్ద కాదని ఓ ప్రకటన వెలువరించింది. అందుకే.. ఫింగర్​ 8 వరకు పెట్రోలింగ్​ నిర్వహించే హక్కు భారత్​కు ఉందని చైనాకు స్పష్టం చేసినట్లు వివరించింది.

పాంగాంగ్​ త్సో ఉత్తర ఒడ్డున భారత్​, చైనా శాశ్వత శిబిరాలు ఎప్పటినుంచో ఉన్నాయని తెలిపింది. మన స్థావరం ఫింగర్‌ 3 వద్ద ఉండగా, చైనాది ఫింగర్‌ 8 వద్ద ఉందని గుర్తుచేసింది రక్షణ శాఖ. ఇరుదేశాల బలగాలు ముందుకు రాకుండా ఎవరి స్థావరాల వద్ద వారు ఉండేలా ప్రస్తుత ఒప్పందం జరిగిందని తెలిపింది.

అంతకుముందు.. ఫింగర్‌ 4 మన భూభాగంలో ఉంటే ఫింగర్‌ 3 వరకు వెనక్కి రావడం ద్వారా మోదీ సర్కారు దేశ భూభాగాన్ని చైనాకు ఇచ్చేసిందని రాహుల్‌ విమర్శించారు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ పైవ్యాఖ్యలు చేసింది.

ఇదీ చూడండి: 'భారత భూభాగాన్ని చైనాకు అప్పగించిన ప్రధాని'

Last Updated : Feb 12, 2021, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.