ETV Bharat / bharat

అసోం తొలిదశ ఎన్నికలకు 173 మంది నామినేషన్​

author img

By

Published : Mar 10, 2021, 8:05 AM IST

Updated : Mar 10, 2021, 8:34 AM IST

అసోంలో తొలిదశ అసెంబ్లీ ఎన్నికలకు 173 మంది అభ్యర్థులు నామినేషన్​ దాఖలు చేశారు. నామినేషన్ సమర్పణకు చివరి రోజైన మంగళవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్భానంద సోనోవాల్​ సహా పలువురు భాజపా, కాంగ్రెస్​ సిట్టింగ్​​ ఎమ్మెల్యేలు నామినేషన్​ దాఖలు చేశారు.

అసోంలో 47 స్థానాలకు జరగనున్న తొలిదశ అసెంబ్లీ ఎన్నికలకు 173 మంది అభ్యర్థులు నామినేషన్​ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ రాష్ట ఎన్నికల సంఘం మంగళవారం తెలిపింది. కొన్ని జిల్లాల నుంచి ఇంకా పూర్తి స్థాయి వివరాలు అందాల్సి ఉన్నందున అభ్యర్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మార్చి 27న ఈ ఎన్నికలు జరగనున్నాయి.

చివరిరోజున వీరే..

నామినేషన్ సమర్పణకు చివరి రోజైన మంగళవారం.. మజులీ నుంచి అసోం ముఖ్యమంత్రి సర్భానంద సోనోవాల్ నామినేషన్​ దాఖలు చేశారు. పలువురు ​భాజపా, కాంగ్రెస్ సిట్టింగ్​ ఎమ్మెల్యేలు నామినేషన్​ సమర్పించారు. దులియాజన్, నహర్కటియా నుంచి అసోం జాతీయ పరిషత్​ అధ్యక్షుడు లురిన్జ్యోతి గొగోయి పోటీ చేయనున్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్న రైజోర్ దళ్ నాయకుడు అఖిల్ గొగోయి కూడా అసోం మొదటి దశ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మరియాని, సిబ్సాగర్ స్థానాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్​ సమర్పించారు.

మార్చి 10న ఈ నామినేషన్​ పత్రాలను అధికారులు పరిశీలించనున్నారు. అభ్యర్థులు మార్చి 12లోగా తమ నామినేషన్​ను ఉపసంహరించుకోవచ్చు. అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను మార్చి 27, ఏప్రిల్​ 1, ఏప్రిల్​ 6న మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి:'విదేశాంగ వ్యూహం'తో అసోంపై భాజపా గురి!

అసోంలో 47 స్థానాలకు జరగనున్న తొలిదశ అసెంబ్లీ ఎన్నికలకు 173 మంది అభ్యర్థులు నామినేషన్​ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ రాష్ట ఎన్నికల సంఘం మంగళవారం తెలిపింది. కొన్ని జిల్లాల నుంచి ఇంకా పూర్తి స్థాయి వివరాలు అందాల్సి ఉన్నందున అభ్యర్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మార్చి 27న ఈ ఎన్నికలు జరగనున్నాయి.

చివరిరోజున వీరే..

నామినేషన్ సమర్పణకు చివరి రోజైన మంగళవారం.. మజులీ నుంచి అసోం ముఖ్యమంత్రి సర్భానంద సోనోవాల్ నామినేషన్​ దాఖలు చేశారు. పలువురు ​భాజపా, కాంగ్రెస్ సిట్టింగ్​ ఎమ్మెల్యేలు నామినేషన్​ సమర్పించారు. దులియాజన్, నహర్కటియా నుంచి అసోం జాతీయ పరిషత్​ అధ్యక్షుడు లురిన్జ్యోతి గొగోయి పోటీ చేయనున్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్న రైజోర్ దళ్ నాయకుడు అఖిల్ గొగోయి కూడా అసోం మొదటి దశ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మరియాని, సిబ్సాగర్ స్థానాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్​ సమర్పించారు.

మార్చి 10న ఈ నామినేషన్​ పత్రాలను అధికారులు పరిశీలించనున్నారు. అభ్యర్థులు మార్చి 12లోగా తమ నామినేషన్​ను ఉపసంహరించుకోవచ్చు. అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను మార్చి 27, ఏప్రిల్​ 1, ఏప్రిల్​ 6న మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి:'విదేశాంగ వ్యూహం'తో అసోంపై భాజపా గురి!

Last Updated : Mar 10, 2021, 8:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.