ETV Bharat / bharat

సోలో సైక్లింగ్​లో ఆర్మీ అధికారి గిన్నిస్​ రికార్డులు

author img

By

Published : Apr 8, 2021, 3:21 PM IST

సోలో సైక్లింగ్​లో రెండు గిన్నిస్ రికార్డులను బద్దలు కొట్టారు ఆర్మీ అధికారి భరత్ పన్ను. ఇందులో 5942కి.మీల సుదీర్ఘమైన 'గోల్డెన్ క్వాడ్రిలేటరల్' రూట్ ఉండటం విశేషం.

Army officer breaks two Guinness World Records for fastest solo cycling
సోలో సైక్లింగ్​లో ఆర్మీ అధికారి 2 గిన్నిస్​ రికార్డులు

భారత సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ కర్నల్ భరత్ పన్ను రెండు గిన్నిస్​ రికార్డులను సాధించారు. గతేడాది అక్టోబర్​లో సోలో సైక్లింగ్​ ఈవెంట్​లలో పాల్గొని ఈ ఘనత సొంతం చేసుకున్నట్లు అధికారులు గురువారం వెల్లడించారు. కొద్ది రోజుల క్రితమే ప్రపంచ రికార్డులకు సంబంధించిన ధ్రువపత్రాలను భరత్ అందుకున్నారు.

Army officer breaks two Guinness World Records for fastest solo cycling
భరత్ పన్ను గిన్నిస్ రికార్డు

మొదటి రికార్డును 2020 అక్టోబర్​ 10న లేహ్​ నుంచి మనాలీ వరకు (472కి.మీలు) కేవలం 35 గంటల 25 నిమిషాల్లో సైకిల్ తొక్కి సాధించారు.

Army officer breaks two Guinness World Records for fastest solo cycling
మనాలీ వద్ద భరత్

రెండోది.. 5942కి.మీల సుదీర్ఘమైన 'గోల్డెన్ క్వాడ్రిలేటరల్' రూట్. ఈ మార్గం దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్​కతాలను కలుపుతూ వెళ్తుంది. దానిని 14 రోజుల 23 గంటల 52 నిమిషాల్లో ఛేదించారు భరత్. ఈ ఈవెంట్​ దిల్లీలోని ఇండియా గేట్ వద్ద అక్టోబర్​ 16న ప్రారంభమై అక్టోబర్​ 30న అదే చోట ముగిసింది.

ఇదీ చూడండి: బంగ్లాదేశ్​ పర్యటనలో భారత ఆర్మీ చీఫ్​

భారత సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ కర్నల్ భరత్ పన్ను రెండు గిన్నిస్​ రికార్డులను సాధించారు. గతేడాది అక్టోబర్​లో సోలో సైక్లింగ్​ ఈవెంట్​లలో పాల్గొని ఈ ఘనత సొంతం చేసుకున్నట్లు అధికారులు గురువారం వెల్లడించారు. కొద్ది రోజుల క్రితమే ప్రపంచ రికార్డులకు సంబంధించిన ధ్రువపత్రాలను భరత్ అందుకున్నారు.

Army officer breaks two Guinness World Records for fastest solo cycling
భరత్ పన్ను గిన్నిస్ రికార్డు

మొదటి రికార్డును 2020 అక్టోబర్​ 10న లేహ్​ నుంచి మనాలీ వరకు (472కి.మీలు) కేవలం 35 గంటల 25 నిమిషాల్లో సైకిల్ తొక్కి సాధించారు.

Army officer breaks two Guinness World Records for fastest solo cycling
మనాలీ వద్ద భరత్

రెండోది.. 5942కి.మీల సుదీర్ఘమైన 'గోల్డెన్ క్వాడ్రిలేటరల్' రూట్. ఈ మార్గం దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్​కతాలను కలుపుతూ వెళ్తుంది. దానిని 14 రోజుల 23 గంటల 52 నిమిషాల్లో ఛేదించారు భరత్. ఈ ఈవెంట్​ దిల్లీలోని ఇండియా గేట్ వద్ద అక్టోబర్​ 16న ప్రారంభమై అక్టోబర్​ 30న అదే చోట ముగిసింది.

ఇదీ చూడండి: బంగ్లాదేశ్​ పర్యటనలో భారత ఆర్మీ చీఫ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.