ETV Bharat / bharat

ఐఎస్​ఐ చేతికి భారత ఆర్మీ రహస్యాలు- జవాన్​ అరెస్ట్​

author img

By

Published : Oct 24, 2021, 7:07 AM IST

పంజాబ్​ పోలీసులు ఓ ఆర్మీ జవాన్​ను అరెస్ట్​ చేశారు. పాకిస్థాన్​ ఐఎస్​ఐకి.. భారత సైన్యానికి చెందిన రహస్య సమాచారాన్ని అందిస్తున్నాడనే కారణంతో అదుపులోకి తీసుకున్నారు.

espionage network
ఐఎస్​ఐ చేతికి భారత ఆర్మీ రహస్యాలు

పాకిస్థాన్​కు రహస్య సమాచారాన్ని అందచేస్తున్నాడనే ఆరోపణలతో ఓ జవానును పంజాబ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. గుజరాత్​కు చెందిన కృనాల్​ కుమార్​ బారియాను అదుపులోకి తీసుకున్న అమృత్​సర్​ పోలీసులు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

కృనాల్​ ప్రస్తుతం ఫిరోజ్​పుర్​ కంటోన్మెంట్​లోని ఐటీ సెల్​లో విధులు నిర్వర్తిస్తున్నాడు. పాకిస్థాన్​ ఐఎస్​ఐకు చెందిన ఏజెంట్లతో కృనాల్​ సామాజిక మాధ్యమాల ద్వారా సంప్రదింపులు జరిపినట్టు పోలీసులు వివరించారు. ఐటీ సెల్​ నుంచి భారత ఆర్మీకి చెందిన అత్యంత సున్నితమైన, రహస్యమైన సమాచారాన్ని పాక్​కు చేరవేస్తున్నట్టు ఆరోపించారు.

వల వేసిన మహిళ..

2020లో ఫేస్​బుక్​ ద్వారా సిద్రాఖాన్​ అనే పాకిస్థానీ మహిళా నిఘా అధికారితో కృనాల్​కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వాట్సాప్​ మెసేజ్​లకు దారితీసింది. అనేకమార్లు ఫోన్లో కూడా మాట్లాడుకున్నారు.

ఐఎస్​ఐకు పనిచేసే విధంగా ఆ మహిళ కృనాల్​కు వల వేసింది. ఫలితంగా వివిధ యాప్​ల ద్వారా సున్నితమైన వివరాలను కృనాల్​ ఆమెకు అప్పగించేశాడు.

దర్యాప్తులో భాగంగా ఫోన్​ను పరిశీలించగా.. ఎన్నో రహస్యమైన డాక్యుమెంట్లు బయటపడ్డాయి. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కృనాల్​ అరెస్ట్​ గురించి ఆర్మీకి సమాచారం అందించినట్టు అధికారులు వెల్లడించారు.

హరియాణాలోనూ..

ఇటీవల హరియాణాలోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ 'ఐఎస్‌ఐ'కి రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నాడన్న ఆరోపణపై ఒక జవాన్‌ను అరెస్టు చేసినట్లు హరియాణా పోలీసులు తెలిపారు. నిందితుడి పేరు రోహిత్‌ కుమార్‌ అని.. అతడి కార్యకలాపాలపై అందిన రహస్య సమాచారం ఆధారంగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి:- DRDO news: బ్రహ్మోస్‌ రహస్యాలు లీకయ్యాయా?

పాకిస్థాన్​కు రహస్య సమాచారాన్ని అందచేస్తున్నాడనే ఆరోపణలతో ఓ జవానును పంజాబ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. గుజరాత్​కు చెందిన కృనాల్​ కుమార్​ బారియాను అదుపులోకి తీసుకున్న అమృత్​సర్​ పోలీసులు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

కృనాల్​ ప్రస్తుతం ఫిరోజ్​పుర్​ కంటోన్మెంట్​లోని ఐటీ సెల్​లో విధులు నిర్వర్తిస్తున్నాడు. పాకిస్థాన్​ ఐఎస్​ఐకు చెందిన ఏజెంట్లతో కృనాల్​ సామాజిక మాధ్యమాల ద్వారా సంప్రదింపులు జరిపినట్టు పోలీసులు వివరించారు. ఐటీ సెల్​ నుంచి భారత ఆర్మీకి చెందిన అత్యంత సున్నితమైన, రహస్యమైన సమాచారాన్ని పాక్​కు చేరవేస్తున్నట్టు ఆరోపించారు.

వల వేసిన మహిళ..

2020లో ఫేస్​బుక్​ ద్వారా సిద్రాఖాన్​ అనే పాకిస్థానీ మహిళా నిఘా అధికారితో కృనాల్​కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వాట్సాప్​ మెసేజ్​లకు దారితీసింది. అనేకమార్లు ఫోన్లో కూడా మాట్లాడుకున్నారు.

ఐఎస్​ఐకు పనిచేసే విధంగా ఆ మహిళ కృనాల్​కు వల వేసింది. ఫలితంగా వివిధ యాప్​ల ద్వారా సున్నితమైన వివరాలను కృనాల్​ ఆమెకు అప్పగించేశాడు.

దర్యాప్తులో భాగంగా ఫోన్​ను పరిశీలించగా.. ఎన్నో రహస్యమైన డాక్యుమెంట్లు బయటపడ్డాయి. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కృనాల్​ అరెస్ట్​ గురించి ఆర్మీకి సమాచారం అందించినట్టు అధికారులు వెల్లడించారు.

హరియాణాలోనూ..

ఇటీవల హరియాణాలోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ 'ఐఎస్‌ఐ'కి రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నాడన్న ఆరోపణపై ఒక జవాన్‌ను అరెస్టు చేసినట్లు హరియాణా పోలీసులు తెలిపారు. నిందితుడి పేరు రోహిత్‌ కుమార్‌ అని.. అతడి కార్యకలాపాలపై అందిన రహస్య సమాచారం ఆధారంగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి:- DRDO news: బ్రహ్మోస్‌ రహస్యాలు లీకయ్యాయా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.