ETV Bharat / bharat

మరో ఆర్నెల్ల పాటు 'కల్లోలిత ప్రాంతం'గా నాగాలాండ్​

author img

By

Published : Dec 30, 2021, 11:03 AM IST

Armed Forces Act: నాగాలాండ్​ను మరో ఆరు నెలలపాటు 'కల్లోలిత ప్రాంతం'గా ప్రకటిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సైన్యం చేతిలో 14 మంది పౌరుల హత్య సంచలనం సృష్టించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Govt declares entire Nagaland disturbed area
Govt declares entire Nagaland disturbed area

Armed Forces Act: మరో ఆరు నెలలపాటు నాగాలాండ్​ను 'కల్లోలిత ప్రాంతం'గా ప్రకటిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వలు జారీ చేసింది. ఈ ప్రాంతంలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్​ఎస్​పీఏ) కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఇటీవల సైన్యం చేతిలో 14 మంది పౌరుల హత్య నేపథ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసింది. వివాదాస్పద సాయుధ దళాల(ప్రత్యేక అధికారాలు) చట్టం-1958ని (ఏఎఫ్​ఎస్​పీఏ) ఎత్తివేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇంతలో మరో ఆరునెలల ఈ చట్టాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

కొన్ని దశాబ్దాలుగా నాగాలాండ్​లో ఏఎఫ్​ఎస్​పీఏ కొనసాగుతోంది. తాజాగా డిసెంబరు 30 నుంచి మరో ఆరు నెలలపాటు ఈ చట్టం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నాగాలాండ్​లోని వివిధ ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళకరంగా ఉన్నందున కల్లోల ప్రాంతంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు.

రద్దు చేయాలని డిమాండ్​

Armed Forces Act Withdrawal: అయితే ఏఎఫ్​ఎస్​పీఏను రద్దు చేయాలని నాగాలాండ్​లోని వివిధ వేర్పాటువాద సంస్థలు పెద్ద ఎత్తున డిమాండ్​ చేస్తున్నాయి.

సాయుధ బలగాల చట్టం ఏంటి?

  • ఈ చట్టం.. భద్రతా బలగాలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తుంది.
  • దీని ప్రకారం.. ఎలాంటి ముందస్తు వారెంట్​ లేకుండా ఎవరినైనా అరెస్టు చేయవచ్చు.
  • ఆపరేషన్లు నిర్వహించవచ్చు.
  • బలగాలు ఎవరినైనా కాల్చి చంపినా.. వీరికి రక్షణ లభిస్తుంది.
  • ఈ చట్టం నాగాలాండ్​లో దశాబ్దాలుగా అమల్లో ఉంది.

ఇదీ చూడండి:

Nagaland Firing Shah: నాగాలాండ్​ కాల్పులపై పార్లమెంటులో షా ప్రకటన

నాగాలాండ్​ కాల్పుల్లో 14కు చేరిన మృతుల సంఖ్య- హై అలర్ట్​!

నాగాలాండ్ ఘటనపై సైన్యం ప్రత్యేక దర్యాప్తు

Armed Forces Act: మరో ఆరు నెలలపాటు నాగాలాండ్​ను 'కల్లోలిత ప్రాంతం'గా ప్రకటిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వలు జారీ చేసింది. ఈ ప్రాంతంలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్​ఎస్​పీఏ) కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఇటీవల సైన్యం చేతిలో 14 మంది పౌరుల హత్య నేపథ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసింది. వివాదాస్పద సాయుధ దళాల(ప్రత్యేక అధికారాలు) చట్టం-1958ని (ఏఎఫ్​ఎస్​పీఏ) ఎత్తివేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇంతలో మరో ఆరునెలల ఈ చట్టాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

కొన్ని దశాబ్దాలుగా నాగాలాండ్​లో ఏఎఫ్​ఎస్​పీఏ కొనసాగుతోంది. తాజాగా డిసెంబరు 30 నుంచి మరో ఆరు నెలలపాటు ఈ చట్టం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నాగాలాండ్​లోని వివిధ ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళకరంగా ఉన్నందున కల్లోల ప్రాంతంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు.

రద్దు చేయాలని డిమాండ్​

Armed Forces Act Withdrawal: అయితే ఏఎఫ్​ఎస్​పీఏను రద్దు చేయాలని నాగాలాండ్​లోని వివిధ వేర్పాటువాద సంస్థలు పెద్ద ఎత్తున డిమాండ్​ చేస్తున్నాయి.

సాయుధ బలగాల చట్టం ఏంటి?

  • ఈ చట్టం.. భద్రతా బలగాలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తుంది.
  • దీని ప్రకారం.. ఎలాంటి ముందస్తు వారెంట్​ లేకుండా ఎవరినైనా అరెస్టు చేయవచ్చు.
  • ఆపరేషన్లు నిర్వహించవచ్చు.
  • బలగాలు ఎవరినైనా కాల్చి చంపినా.. వీరికి రక్షణ లభిస్తుంది.
  • ఈ చట్టం నాగాలాండ్​లో దశాబ్దాలుగా అమల్లో ఉంది.

ఇదీ చూడండి:

Nagaland Firing Shah: నాగాలాండ్​ కాల్పులపై పార్లమెంటులో షా ప్రకటన

నాగాలాండ్​ కాల్పుల్లో 14కు చేరిన మృతుల సంఖ్య- హై అలర్ట్​!

నాగాలాండ్ ఘటనపై సైన్యం ప్రత్యేక దర్యాప్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.