ETV Bharat / bharat

చందాదార్లను భయపెట్టే యత్నం.. మార్గదర్శి వ్యాపారాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు

author img

By

Published : May 31, 2023, 7:37 AM IST

Updated : May 31, 2023, 8:45 AM IST

Margadarsi Chit Fund: మార్గదర్శి చిట్‌ఫండ్‌పై ఏపీ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే తప్పుడు ఆరోపణలతో సంస్థకు నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించిన ప్రభుత్వం.. ఇప్పుడు చందాదారుల్లోనూ భయం కలిగించే చర్యలకు పూనుకుంది. కక్షపూరితంగా మార్గదర్శి చరాస్తుల ఎటాచ్‌మెంట్‌ ఉత్తర్వులు వెలువరించింది. వ్యాపారాన్ని దెబ్బతీయాలనే కుట్రతో అసత్య ఆరోపణలు చేస్తూ.. చట్టాలకు వక్రభాష్యం చెబుతోంది.

margadarsi chit fund
మార్గదర్శి చిట్​ఫండ్స్​
చందాదార్లను భయపెట్టే యత్నం.. మార్గదర్శి వ్యాపారాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు

Margadarsi Case: మార్గదర్శి చిట్‌ఫండ్‌పై కొంతకాలంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ, కేసులు పెట్టి వేధిస్తూ చందాదార్లలో సంస్థ విశ్వసనీయతను దెబ్బతీయడానికి శతవిధాలుగా ప్రయత్నించి విఫలమైన ఏపీ ప్రభుత్వం.. మరో కుటిల పన్నాగానికి నడుంకట్టింది. చందాదారుల్లో భయం కలిగించడంతో పాటు.. సంస్థ వ్యాపారాన్ని దెబ్బతీసే లక్ష్యంతో మార్గదర్శి చిట్‌ఫండ్‌కు చెందిన 793.50 కోట్ల సొమ్మును అటాచ్‌ చేసేందుకు ఏపీ హోంశాఖ జీఓ జారీ చేసింది. చట్టాన్ని మార్గదర్శి చిట్‌ఫండ్‌ ఏ విధంగానూ ఉల్లంఘించనప్పటికీ.. ఈ సంస్థకు వర్తించని ఏపీ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ యాక్ట్‌ 1999ను ప్రస్తావిస్తూ ఎటాచ్‌మెంట్ జీఓ జారీ చేసింది. దీనికి వెనుక దురుద్దేశాలు, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది విస్పష్టం. చట్టానికి తనకు తోచిన వక్రభాష్యం చెప్పి, తనకు అడ్డుగా ఉన్నవారిని వేధించడమే లక్ష్యంగా చేస్తున్న కుటిల యత్నంగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఒక పక్క చందాదార్ల ప్రయోజనాల పరిరక్షణకే ఇదంతా చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. మరోపక్క అదే చందాదార్లకు నష్టం చేయడానికి నడుంకట్టింది. ఇది పూర్తిగా కక్షపూరిత చర్య. బాధ్యతాయుతమైన ఏ ప్రభుత్వమూ చట్టబద్ధంగా వ్యాపారాన్ని నిర్వహించే సంస్థలపై’ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడదు.

మార్గదర్శి చిట్‌ఫండ్‌ వ్యాపార కార్యకలాపాలకు నష్టం వాటిల్లే విధంగా ఎలాంటి చర్యలూ తీసుకోరాదని ఇప్పటికే న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని పట్టించుకోకుండా, న్యాయస్థానం ఆదేశాలకు పూర్తి భిన్నంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్గదర్శి శాఖల్లో కొత్త చిట్లు ప్రారంభించడానికి అనుమతి ఇవ్వడం లేదు. కాలవ్యవధి ముగిసిన చిట్‌ గ్రూపులకు సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్లు రిలీజ్‌ చేయకుండా తొక్కిపడుతోంది. ఇవన్నీ సంస్థ వ్యాపారాన్ని దెబ్బతీసే చర్యలే. ఇప్పుడు చరాస్తుల ఎటాచ్‌మెంట్‌కు జీవో తీసుకొచ్చింది. ఇందులోనూ సత్యదూరమైన, పదే పదే చేసే ఆరోపణలే ప్రస్తావించింది.

మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం, సీఐడీ చేసిన ఆరోపణలకు సరైన సమాధానాలు ఇచ్చినప్పటికీ.. ప్రభుత్వం మార్గదర్శిపై దిగజారుడు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా జారీచేసిన ఎటాచ్‌మెంట్‌ ఉత్తర్వులే దీనికి ఉదాహరణ. చందాదార్ల సొమ్మును కార్పొరేట్‌ కార్యాలయానికి బదిలీ చేసి, ఆ సొమ్మును మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడిగా పెట్టారనే ఆరోపణ పూర్తిగా అబద్ధం. సంస్థకు లభించిన కమీషన్‌ ఆదాయంలో మిగిలిన మొత్తం మాత్రమే కార్పొరేట్‌ కార్యాలయానికి బదిలీ అవుతుంది. ఇది సంస్థకు చెందిన మిగులు ఆదాయం. ఆరు దశాబ్దాల నుంచి వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగిస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్‌ ఇలా మిగిలిన సొమ్మును జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది. అందుకే సంస్థ ఆర్థికంగా పరిపుష్టంగా ఉండటమే కాకుండా, చందాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెల్లింపులు చేస్తోంది. 2022 మార్చి 31 నాటికి సంస్థ వద్ద 15 వందల9 కోట్ల రూపాయల నిధులు ఉండటానికి ఈ జాగ్రత్తే కారణం.

మార్గదర్శి చిట్‌ఫండ్‌లో చందాదారుల నుంచి నెలవారీ చిట్‌సొమ్ము వసూలు కాగానే.. దాన్ని ఆ నెలలో పాటపాడుకున్న వారికి చెల్లిస్తారు. సంస్థకు మిగిలేది కేవలం ఆ చిట్‌కు సంబంధించిన కమిషన్‌ ఆదాయం మాత్రమే. ఆ సొమ్మును ఎక్కడైనా నిల్వ చేసుకోవచ్చు లేదా పెట్టుబడి పెట్టొచ్చు. వాస్తవం ఇదయితే.. చందాదారుల సొమ్మును మళ్లించారంటూ ఏపీ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఎంతచెప్పినా వాస్తవాన్ని గ్రహించాలనే ఆలోచన చేయడం లేదు. రిజర్వు బ్యాంకు నిబంధనలను ఉల్లంఘించారనేది కూడా పూర్తిగా అవాస్తవం. మార్గదర్శి చిట్‌ఫండ్‌ ఎలాంటి డిపాజిట్లు తీసుకోవడం లేదు. డిపాజిట్లే తీసుకోనప్పుడు నిబంధనలు ఎలా ఉల్లంఘిస్తుంది. చందాదారులు చిట్‌ మొత్తాన్ని తీసుకునే సమయంలో, ఆ చిట్‌ కింద భవిష్యత్తులో చెల్లించాల్సిన నెలవారీ చందాల మొత్తాన్ని ష్యూరిటీ కింద సంస్థకు చందాదారు.. చిట్‌ఫండ్‌ చట్టానికి లోబడి స్వచ్ఛందంగా ఇవ్వొచ్చు. ఇది పూర్తిగా ఫోర్‌మెన్‌ విచక్షణతో తీసుకునే నిర్ణయం. చిట్‌ఫండ్‌ కంపెనీలకు వర్తించే విధంగా ఆర్‌బీఐ జారీ చేసిన ‘మిస్‌లేనియస్‌ నాన్‌ బ్యాంకింగ్‌ కంపెనీస్‌ డైరెక్షన్స్‌’ కింద ష్యూరిటీ తీసుకోవడానికి అవకాశం ఉంది. ష్యూరిటీ మొత్తాన్ని సాధారణ డిపాజిట్‌ కింద పరిగణించరాదని ఈ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. చిట్‌గ్రూప్‌ ప్రస్తుత చందా, భవిష్యత్తులో చెల్లించాల్సిన చందా లేదా అడ్వాన్సుగా చెల్లించే చందా సొమ్ము డిపాజిట్‌ నిర్వచనం కిందకు రానే రాదు. వాస్తవాలు ఇలా ఉంటే...మార్గదర్శి చందాదార్ల నుంచి డిపాజిట్లు తీసుకుంటోందని అందుకే ఏపీ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ యాక్ట్‌-1999 వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది.చందాదార్ల సొమ్మును ఎక్కడికో తరలిస్తోందని, ఏదో జరుగుతోందంటూ తప్పుడు ఆరోపణలను సంస్థపై రుద్దుతూ కక్ష సాధిస్తోంది. ఇది 60 ఏళ్లుగా సజావుగా, స్థిరగా నడిచే సంస్థను దెబ్బతీసే కుట్రలో భాగమే తప్ప మరొకటి కాదు.

ఇవీ చదవండి :

చందాదార్లను భయపెట్టే యత్నం.. మార్గదర్శి వ్యాపారాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు

Margadarsi Case: మార్గదర్శి చిట్‌ఫండ్‌పై కొంతకాలంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ, కేసులు పెట్టి వేధిస్తూ చందాదార్లలో సంస్థ విశ్వసనీయతను దెబ్బతీయడానికి శతవిధాలుగా ప్రయత్నించి విఫలమైన ఏపీ ప్రభుత్వం.. మరో కుటిల పన్నాగానికి నడుంకట్టింది. చందాదారుల్లో భయం కలిగించడంతో పాటు.. సంస్థ వ్యాపారాన్ని దెబ్బతీసే లక్ష్యంతో మార్గదర్శి చిట్‌ఫండ్‌కు చెందిన 793.50 కోట్ల సొమ్మును అటాచ్‌ చేసేందుకు ఏపీ హోంశాఖ జీఓ జారీ చేసింది. చట్టాన్ని మార్గదర్శి చిట్‌ఫండ్‌ ఏ విధంగానూ ఉల్లంఘించనప్పటికీ.. ఈ సంస్థకు వర్తించని ఏపీ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ యాక్ట్‌ 1999ను ప్రస్తావిస్తూ ఎటాచ్‌మెంట్ జీఓ జారీ చేసింది. దీనికి వెనుక దురుద్దేశాలు, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది విస్పష్టం. చట్టానికి తనకు తోచిన వక్రభాష్యం చెప్పి, తనకు అడ్డుగా ఉన్నవారిని వేధించడమే లక్ష్యంగా చేస్తున్న కుటిల యత్నంగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఒక పక్క చందాదార్ల ప్రయోజనాల పరిరక్షణకే ఇదంతా చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. మరోపక్క అదే చందాదార్లకు నష్టం చేయడానికి నడుంకట్టింది. ఇది పూర్తిగా కక్షపూరిత చర్య. బాధ్యతాయుతమైన ఏ ప్రభుత్వమూ చట్టబద్ధంగా వ్యాపారాన్ని నిర్వహించే సంస్థలపై’ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడదు.

మార్గదర్శి చిట్‌ఫండ్‌ వ్యాపార కార్యకలాపాలకు నష్టం వాటిల్లే విధంగా ఎలాంటి చర్యలూ తీసుకోరాదని ఇప్పటికే న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని పట్టించుకోకుండా, న్యాయస్థానం ఆదేశాలకు పూర్తి భిన్నంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్గదర్శి శాఖల్లో కొత్త చిట్లు ప్రారంభించడానికి అనుమతి ఇవ్వడం లేదు. కాలవ్యవధి ముగిసిన చిట్‌ గ్రూపులకు సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్లు రిలీజ్‌ చేయకుండా తొక్కిపడుతోంది. ఇవన్నీ సంస్థ వ్యాపారాన్ని దెబ్బతీసే చర్యలే. ఇప్పుడు చరాస్తుల ఎటాచ్‌మెంట్‌కు జీవో తీసుకొచ్చింది. ఇందులోనూ సత్యదూరమైన, పదే పదే చేసే ఆరోపణలే ప్రస్తావించింది.

మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం, సీఐడీ చేసిన ఆరోపణలకు సరైన సమాధానాలు ఇచ్చినప్పటికీ.. ప్రభుత్వం మార్గదర్శిపై దిగజారుడు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా జారీచేసిన ఎటాచ్‌మెంట్‌ ఉత్తర్వులే దీనికి ఉదాహరణ. చందాదార్ల సొమ్మును కార్పొరేట్‌ కార్యాలయానికి బదిలీ చేసి, ఆ సొమ్మును మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడిగా పెట్టారనే ఆరోపణ పూర్తిగా అబద్ధం. సంస్థకు లభించిన కమీషన్‌ ఆదాయంలో మిగిలిన మొత్తం మాత్రమే కార్పొరేట్‌ కార్యాలయానికి బదిలీ అవుతుంది. ఇది సంస్థకు చెందిన మిగులు ఆదాయం. ఆరు దశాబ్దాల నుంచి వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగిస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్‌ ఇలా మిగిలిన సొమ్మును జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది. అందుకే సంస్థ ఆర్థికంగా పరిపుష్టంగా ఉండటమే కాకుండా, చందాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెల్లింపులు చేస్తోంది. 2022 మార్చి 31 నాటికి సంస్థ వద్ద 15 వందల9 కోట్ల రూపాయల నిధులు ఉండటానికి ఈ జాగ్రత్తే కారణం.

మార్గదర్శి చిట్‌ఫండ్‌లో చందాదారుల నుంచి నెలవారీ చిట్‌సొమ్ము వసూలు కాగానే.. దాన్ని ఆ నెలలో పాటపాడుకున్న వారికి చెల్లిస్తారు. సంస్థకు మిగిలేది కేవలం ఆ చిట్‌కు సంబంధించిన కమిషన్‌ ఆదాయం మాత్రమే. ఆ సొమ్మును ఎక్కడైనా నిల్వ చేసుకోవచ్చు లేదా పెట్టుబడి పెట్టొచ్చు. వాస్తవం ఇదయితే.. చందాదారుల సొమ్మును మళ్లించారంటూ ఏపీ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఎంతచెప్పినా వాస్తవాన్ని గ్రహించాలనే ఆలోచన చేయడం లేదు. రిజర్వు బ్యాంకు నిబంధనలను ఉల్లంఘించారనేది కూడా పూర్తిగా అవాస్తవం. మార్గదర్శి చిట్‌ఫండ్‌ ఎలాంటి డిపాజిట్లు తీసుకోవడం లేదు. డిపాజిట్లే తీసుకోనప్పుడు నిబంధనలు ఎలా ఉల్లంఘిస్తుంది. చందాదారులు చిట్‌ మొత్తాన్ని తీసుకునే సమయంలో, ఆ చిట్‌ కింద భవిష్యత్తులో చెల్లించాల్సిన నెలవారీ చందాల మొత్తాన్ని ష్యూరిటీ కింద సంస్థకు చందాదారు.. చిట్‌ఫండ్‌ చట్టానికి లోబడి స్వచ్ఛందంగా ఇవ్వొచ్చు. ఇది పూర్తిగా ఫోర్‌మెన్‌ విచక్షణతో తీసుకునే నిర్ణయం. చిట్‌ఫండ్‌ కంపెనీలకు వర్తించే విధంగా ఆర్‌బీఐ జారీ చేసిన ‘మిస్‌లేనియస్‌ నాన్‌ బ్యాంకింగ్‌ కంపెనీస్‌ డైరెక్షన్స్‌’ కింద ష్యూరిటీ తీసుకోవడానికి అవకాశం ఉంది. ష్యూరిటీ మొత్తాన్ని సాధారణ డిపాజిట్‌ కింద పరిగణించరాదని ఈ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. చిట్‌గ్రూప్‌ ప్రస్తుత చందా, భవిష్యత్తులో చెల్లించాల్సిన చందా లేదా అడ్వాన్సుగా చెల్లించే చందా సొమ్ము డిపాజిట్‌ నిర్వచనం కిందకు రానే రాదు. వాస్తవాలు ఇలా ఉంటే...మార్గదర్శి చందాదార్ల నుంచి డిపాజిట్లు తీసుకుంటోందని అందుకే ఏపీ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ యాక్ట్‌-1999 వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది.చందాదార్ల సొమ్మును ఎక్కడికో తరలిస్తోందని, ఏదో జరుగుతోందంటూ తప్పుడు ఆరోపణలను సంస్థపై రుద్దుతూ కక్ష సాధిస్తోంది. ఇది 60 ఏళ్లుగా సజావుగా, స్థిరగా నడిచే సంస్థను దెబ్బతీసే కుట్రలో భాగమే తప్ప మరొకటి కాదు.

ఇవీ చదవండి :

Last Updated : May 31, 2023, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.