ETV Bharat / bharat

పెరుగుతున్న కేసులపై 'షా' సమీక్ష- రాష్ట్రాల్లో ఆంక్షలు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు ఆర్​టీ-పీసీఆర్​ పరీక్ష చేయించుకోవాలని కొన్ని రాష్ట్రాలు నిబంధనలు విధించాయి. వైరస్​ కట్టడి చర్యలపై అధికారులతో కేంద్రం హోం మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు.

author img

By

Published : Feb 22, 2021, 10:17 PM IST

corona spread in india
పెరుగుతున్న కేసులపై షా సమీక్ష- రాష్ట్రాల్లో ఆంక్షలు

దేశంలో కరోనా మళ్లీ క్రమంగా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజువారీ కేసుల్లో గణనీయమైన పెరగుదల నమోదవుతోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. కొవిడ్​ వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో అధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్​ షా సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వ్యాక్సినేషన్ సహా, వైరస్​ను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై అమిత్​ షా.. సమీక్షించినట్లు అధికారులు తెలిపారు. వైరస్​ ప్రభావిత రాష్ట్రాలకు అందించే సహాయ సహకారాలపై కూడా చర్చించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​, హోం శాఖ కార్యదర్శి అజయ్​ భల్లా సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కర్ణాటకలో ఆంక్షలు కఠినతరం

అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి నిషేధం విధించటం లేదని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే.. మహారాష్ట్ర, కేరళ నుంచి వచ్చే వారు 72 గంటల ముందు ఆర్​టీ-పీసీఆర్​ పరీక్ష చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. నెగెటివ్​గా తేలిన వారిని మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తామని చెప్పింది.

కేరళలో ఎంట్రీ పాయింట్లు బంద్​

వయనాడ్​, కాసర్​గోడె జిల్లాల్లోని 13 ఎంట్రీ పాయింట్లను కేరళ ప్రభుత్వం మూసివేసింది. దీంతో కర్ణాటక సరిహద్దులో నివసించే కేరళ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక నుంచి కేరళకు వచ్చే వారు ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. కేరళలో ఫిబ్రవరి 21 వరకు 58,000 కరోనా యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

నాగ్​పుర్​లో మార్చి 7 వరకు..

మహారాష్ట్రలో రోజువారీ కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో నాగ్​పుర్​ జిల్లాలో కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి నితిన్​ రౌత్​ తెలిపారు. కళాశాలలు, పాఠశాలలు, శిక్షణా తరగతులను మార్చి 7 వరకు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 7వరకు ఎలాంటి రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలను నిర్వహించేందుకు వీల్లేదని స్పష్టం చేశారు.

దిల్లీలో ప్రజారవాణాపై ఆంక్షలు

దిల్లీలో బస్సులు, మెట్రో రైళ్లు పరిమిత సామర్థ్యంతోనే మరో రెండు వారాలకు పైగా కొనసాగుతాయని దిల్లీ విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, కేరళ, చత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. మెట్రో రైళ్లలో సీటుకు సీటుకు మధ్య ఖాళీ ఉండాలని స్పష్టం చేశారు.

దిల్లీలో ఆదివారం మరో 145 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఇప్పటివరకు 10,900 మంది కొవిడ్​ ధాటికి బలయ్యారు.

నిబంధనలు పాటించకపోవడం వల్లే..

ప్రజలు కొవిడ్​ నిబంధనలు పాటించకపోవండ వల్లే పంజాబ్​లో కరోనా కేసులు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రజలందరూ కరోనా నిబంధనలు తప్పక పాటించాలని కోరారు.

మధ్యప్రదేశ్​లో థర్మల్​ స్క్రీనింగ్​

ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్​ ప్రభుత్వం అప్రమత్తమైంది. పొరుగు రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రంలోకి వచ్చే వారికి థర్మల్​ స్క్రీనింగ్​ నిర్వహిస్తామని తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్ చౌహాన్​ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు.

వారం రోజుల నుంచి మధ్యప్రదేశ్​లో రోజూ 200కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం సాయంత్రం వరకు ఆ రాష్ట్రంలో మొత్తం 2,59,427 మంది కొవిడ్​ బాధితులుగా మారారు. 3,854 మంది వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి:

'భారత్​లో కరోనా పాజిటివిటీ రేటు 5.2%'

అపార్ట్​మెంట్​లో 10 మందికి కరోనా- 500 మందికి టెస్టులు

దేశంలో కరోనా మళ్లీ క్రమంగా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజువారీ కేసుల్లో గణనీయమైన పెరగుదల నమోదవుతోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. కొవిడ్​ వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో అధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్​ షా సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వ్యాక్సినేషన్ సహా, వైరస్​ను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై అమిత్​ షా.. సమీక్షించినట్లు అధికారులు తెలిపారు. వైరస్​ ప్రభావిత రాష్ట్రాలకు అందించే సహాయ సహకారాలపై కూడా చర్చించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​, హోం శాఖ కార్యదర్శి అజయ్​ భల్లా సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కర్ణాటకలో ఆంక్షలు కఠినతరం

అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి నిషేధం విధించటం లేదని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే.. మహారాష్ట్ర, కేరళ నుంచి వచ్చే వారు 72 గంటల ముందు ఆర్​టీ-పీసీఆర్​ పరీక్ష చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. నెగెటివ్​గా తేలిన వారిని మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తామని చెప్పింది.

కేరళలో ఎంట్రీ పాయింట్లు బంద్​

వయనాడ్​, కాసర్​గోడె జిల్లాల్లోని 13 ఎంట్రీ పాయింట్లను కేరళ ప్రభుత్వం మూసివేసింది. దీంతో కర్ణాటక సరిహద్దులో నివసించే కేరళ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక నుంచి కేరళకు వచ్చే వారు ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. కేరళలో ఫిబ్రవరి 21 వరకు 58,000 కరోనా యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

నాగ్​పుర్​లో మార్చి 7 వరకు..

మహారాష్ట్రలో రోజువారీ కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో నాగ్​పుర్​ జిల్లాలో కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి నితిన్​ రౌత్​ తెలిపారు. కళాశాలలు, పాఠశాలలు, శిక్షణా తరగతులను మార్చి 7 వరకు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 7వరకు ఎలాంటి రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలను నిర్వహించేందుకు వీల్లేదని స్పష్టం చేశారు.

దిల్లీలో ప్రజారవాణాపై ఆంక్షలు

దిల్లీలో బస్సులు, మెట్రో రైళ్లు పరిమిత సామర్థ్యంతోనే మరో రెండు వారాలకు పైగా కొనసాగుతాయని దిల్లీ విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, కేరళ, చత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. మెట్రో రైళ్లలో సీటుకు సీటుకు మధ్య ఖాళీ ఉండాలని స్పష్టం చేశారు.

దిల్లీలో ఆదివారం మరో 145 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఇప్పటివరకు 10,900 మంది కొవిడ్​ ధాటికి బలయ్యారు.

నిబంధనలు పాటించకపోవడం వల్లే..

ప్రజలు కొవిడ్​ నిబంధనలు పాటించకపోవండ వల్లే పంజాబ్​లో కరోనా కేసులు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రజలందరూ కరోనా నిబంధనలు తప్పక పాటించాలని కోరారు.

మధ్యప్రదేశ్​లో థర్మల్​ స్క్రీనింగ్​

ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్​ ప్రభుత్వం అప్రమత్తమైంది. పొరుగు రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రంలోకి వచ్చే వారికి థర్మల్​ స్క్రీనింగ్​ నిర్వహిస్తామని తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్ చౌహాన్​ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు.

వారం రోజుల నుంచి మధ్యప్రదేశ్​లో రోజూ 200కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం సాయంత్రం వరకు ఆ రాష్ట్రంలో మొత్తం 2,59,427 మంది కొవిడ్​ బాధితులుగా మారారు. 3,854 మంది వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి:

'భారత్​లో కరోనా పాజిటివిటీ రేటు 5.2%'

అపార్ట్​మెంట్​లో 10 మందికి కరోనా- 500 మందికి టెస్టులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.