ETV Bharat / bharat

దేశంలో కొత్త వేరియంట్ కలవరం.. చైనా నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్​

author img

By

Published : Dec 25, 2022, 8:22 PM IST

చైనాలో విస్తృత వేగంతో వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్‌ బీఎఫ్‌.7 భారత్‌ను భయపెడుతోంది. తాజాగా రెండు రోజుల క్రితం చైనా నుంచి ఆగ్రాకు వచ్చిన ఓ వ్యక్తికి కొవిడ్ నిర్ధరణ అయ్యింది. అతడి శాంపిల్స్​ను జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్​కు పంపారు అధికారులు.

covid new variant in india
కొవిడ్ కొత్త వేరియంట్

కొవిడ్‌ తొలిసారి వెలుగు చూసిన చైనాలో మహమ్మారి మరోసారి ఉగ్రరూపం చూపిస్తోంది. కొవిడ్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 చైనాలో విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. బీఎఫ్.7 వేరియంట్ కేసులు భారత్​లో రాకుండా జాగ్రత్తపడుతోంది. అయితే రెండు రోజుల క్రితం చైనా నుంచి భారత్​కు వచ్చిన ఓ వ్యక్తికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. బాధితుడు ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రాకు చెందిన 40 ఏళ్ల వ్యాపారి అని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడు హోం ఐసోలేషన్​లో ఉన్నాడని చెప్పారు. లఖ్​నవూలోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్​కు అతడి నమూనాలను పంపినట్లు పేర్కొన్నారు.

"బాధితుడు ప్రస్తుతం హోం ఐసోలేషన్​లో ఉన్నాడు. అతడిని కలిసిన వారికి, కుటుంబ సభ్యులకు కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేసేందుకు ఆరోగ్య బృందాలను పంపాం. కొవిడ్ సోకిన వ్యక్తి డిసెంబరు 23న చైనా నుంచి దిల్లీ మీదుగా ఆగ్రాకు చేరుకున్నాడు. కరోనా లక్షణాలతో బాధపడిన అతడు ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్నాడు. అప్పడు కొవిడ్ పాజిటివ్​గా తేలింది. నవంబరు 25 తర్వాత ఇదే ఆగ్రా జిల్లాలో ఇదే మొదటి కేసు. విదేశాల నుంచి వచ్చిన వారు ఇంట్లో హోం ఐసోలేషన్​లో ఉండాలి. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే కరోనా పరీక్షలు చేయించుకోవాలి."
-అరుణ్ శ్రీవాస్తవ, చీఫ్ మెడికల్ ఆఫీసర్​

ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా కొవిడ్​ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవడం సహా కొవిడ్‌ టెస్టులు, వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని ఇటీవలే స్పష్టం చేసింది. మరోవైపు, దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమైతే ఎలా వ్యవహరించాలన్నదానిపై మంగళవారం మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ లభ్యత, వైద్య సిబ్బంది అందుబాటు తదితర అంశాలపై మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని లేఖలో కోరింది.

కొవిడ్‌ తొలిసారి వెలుగు చూసిన చైనాలో మహమ్మారి మరోసారి ఉగ్రరూపం చూపిస్తోంది. కొవిడ్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 చైనాలో విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. బీఎఫ్.7 వేరియంట్ కేసులు భారత్​లో రాకుండా జాగ్రత్తపడుతోంది. అయితే రెండు రోజుల క్రితం చైనా నుంచి భారత్​కు వచ్చిన ఓ వ్యక్తికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. బాధితుడు ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రాకు చెందిన 40 ఏళ్ల వ్యాపారి అని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడు హోం ఐసోలేషన్​లో ఉన్నాడని చెప్పారు. లఖ్​నవూలోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్​కు అతడి నమూనాలను పంపినట్లు పేర్కొన్నారు.

"బాధితుడు ప్రస్తుతం హోం ఐసోలేషన్​లో ఉన్నాడు. అతడిని కలిసిన వారికి, కుటుంబ సభ్యులకు కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేసేందుకు ఆరోగ్య బృందాలను పంపాం. కొవిడ్ సోకిన వ్యక్తి డిసెంబరు 23న చైనా నుంచి దిల్లీ మీదుగా ఆగ్రాకు చేరుకున్నాడు. కరోనా లక్షణాలతో బాధపడిన అతడు ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్నాడు. అప్పడు కొవిడ్ పాజిటివ్​గా తేలింది. నవంబరు 25 తర్వాత ఇదే ఆగ్రా జిల్లాలో ఇదే మొదటి కేసు. విదేశాల నుంచి వచ్చిన వారు ఇంట్లో హోం ఐసోలేషన్​లో ఉండాలి. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే కరోనా పరీక్షలు చేయించుకోవాలి."
-అరుణ్ శ్రీవాస్తవ, చీఫ్ మెడికల్ ఆఫీసర్​

ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా కొవిడ్​ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవడం సహా కొవిడ్‌ టెస్టులు, వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని ఇటీవలే స్పష్టం చేసింది. మరోవైపు, దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమైతే ఎలా వ్యవహరించాలన్నదానిపై మంగళవారం మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ లభ్యత, వైద్య సిబ్బంది అందుబాటు తదితర అంశాలపై మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని లేఖలో కోరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.