ETV Bharat / bharat

టికెట్ దక్కలేదని సమాజ్​వాదీ నేత ఆత్మహత్యా యత్నం - ఆదిత్య ఠాకూర్ సమాజ్​వాదీ

Samajwadi leader suicide: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించలేదని సమాజ్​వాదీ పార్టీ నేత ఆత్మహత్యకు ప్రయత్నించారు. పార్టీ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. అయితే, దగ్గర్లోనే ఉన్న పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు.

Samajwadi leader suicide
Samajwadi leader suicide
author img

By

Published : Jan 16, 2022, 1:40 PM IST

ఆదిత్య ఠాకూర్

Samajwadi leader suicide: ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ లభించలేదని సమాజ్​వాదీ నేత ఆదిత్య ఠాకూర్ ఆత్మహత్యకు యత్నించారు. లఖ్​నవూలోని సమాజ్​వాదీ పార్టీ కార్యాలయం ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. సమీపంలోనే ఉన్న పోలీసులు వెంటనే వచ్చి ఆయన్ను అడ్డుకున్నారు.

Samajwadi ticket Leader tried to suicide

పార్టీ అభ్యర్థిత్వం కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నానని, అప్పటి నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకున్నానని ఠాకూర్ చెప్పుకొచ్చారు. ఐదేళ్లుగా ప్రజల మధ్యే ఉంటూ, సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేశానని తెలిపారు.

"ఐదేళ్లుగా నేను కష్టపడి పనిచేశా. అలాంటిది నన్ను కాదని వేరే వ్యక్తికి పార్టీ టికెట్ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో నాకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు."

-ఆదిత్య ఠాకూర్, ఎస్​పీ నేత

క్షణాల వ్యవధిలో ఆయన్ను పోలీసులు కాపాడగలిగారు. ఒంటిపై పోసుకున్న పెట్రోల్ కళ్లలోకి చేరడం వల్ల ఇబ్బందులు పడ్డారు ఠాకూర్.

అభ్యర్థులపై కసరత్తు...

ఉత్తర్​ప్రదేశ్​లో తొలిదశ ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 125 మందితో తొలి జాబితా ప్రకటించింది. భాజపా, సమాజ్​వాదీ సైతం పలువురు అభ్యర్థులను ఖరారు చేశాయి.

ఇదీ చదవండి: భారత్​లో కరోనా టీకా పంపిణీకి ఏడాది.. కీలక మైలురాళ్లు ఇవే..

ఆదిత్య ఠాకూర్

Samajwadi leader suicide: ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ లభించలేదని సమాజ్​వాదీ నేత ఆదిత్య ఠాకూర్ ఆత్మహత్యకు యత్నించారు. లఖ్​నవూలోని సమాజ్​వాదీ పార్టీ కార్యాలయం ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. సమీపంలోనే ఉన్న పోలీసులు వెంటనే వచ్చి ఆయన్ను అడ్డుకున్నారు.

Samajwadi ticket Leader tried to suicide

పార్టీ అభ్యర్థిత్వం కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నానని, అప్పటి నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకున్నానని ఠాకూర్ చెప్పుకొచ్చారు. ఐదేళ్లుగా ప్రజల మధ్యే ఉంటూ, సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేశానని తెలిపారు.

"ఐదేళ్లుగా నేను కష్టపడి పనిచేశా. అలాంటిది నన్ను కాదని వేరే వ్యక్తికి పార్టీ టికెట్ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో నాకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు."

-ఆదిత్య ఠాకూర్, ఎస్​పీ నేత

క్షణాల వ్యవధిలో ఆయన్ను పోలీసులు కాపాడగలిగారు. ఒంటిపై పోసుకున్న పెట్రోల్ కళ్లలోకి చేరడం వల్ల ఇబ్బందులు పడ్డారు ఠాకూర్.

అభ్యర్థులపై కసరత్తు...

ఉత్తర్​ప్రదేశ్​లో తొలిదశ ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 125 మందితో తొలి జాబితా ప్రకటించింది. భాజపా, సమాజ్​వాదీ సైతం పలువురు అభ్యర్థులను ఖరారు చేశాయి.

ఇదీ చదవండి: భారత్​లో కరోనా టీకా పంపిణీకి ఏడాది.. కీలక మైలురాళ్లు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.