24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 30,000 కరోనా యాక్టివ్ కేసులు తగ్గిపోయాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దాంతో యాక్టివ్ కేసుల సంఖ్య 37,15,221కి పరిమితమైందని వెల్లడించింది. 61 రోజుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య ఒక్క రోజులో 30,000 తగ్గిపోవడం ఇదే తొలిసారి అని పేర్కొంది.
కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు
- 24 గంటల్లో దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య- 3,56,082
- కరోనా బారిన పడ్డవారి సంఖ్య- 3,29,942
- మరణాలు- 3,876
- మరణాల శాతం- 1.09
- మొత్తం కోలుకున్న వారి సంఖ్య- 1,90,27,304
- దేశంలో 13 రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య- 82.68శాతం
- ఇప్పటి వరకు(115రోజుల నుంచి) 25,03,756 కరోనా టీకా డోసులు పంపిణీ
విదేశాల నుంచి అందిన సాయం:
- ఆక్సిజన్ ఉన్న సిలిండర్లు- 8,900
- ఖాళీ ఆక్సిజన్ సిలిండర్లు- 5,043
- ఆక్సిజన్ ప్లాంట్లు- 18
- వెంటిలేటర్లు- 5,698
- రెమ్డెసివిర్ ఇంజక్షన్లు- 3.4 లక్షలు
- రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల దగ్గర ఉన్న కరోనా టీకా డోసులు- 90లక్షలు
- కేంద్రం మరో మూడు రోజుల్లో పంపించనున్న డోసులు- 7లక్షలు
ఇదీ చదవండి: ఆంక్షల వేళ.. అంతిమ యాత్రకు పోటెత్తిన జనం