ETV Bharat / bharat

కేజ్రీవాల్​కు ఎల్​జీ మరో షాక్.. రూ.97కోట్లు కట్టాలని ఆదేశం.. ఎందుకంటే?

author img

By

Published : Dec 20, 2022, 6:08 PM IST

ప్రభుత్వ ప్రకటనలను పార్టీ ప్రయోజనాలకు వినియోగించారని పేర్కొంటూ.. వాటికి సంబంధించి రూ.97 కోట్లు చెల్లించాలని దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా.. ఆమ్‌ ఆద్మీ పార్టీని ఆదేశించారు. అయితే, ఎల్‌జీకి ఈ అధికారం లేదని ఆప్‌ ఖండించింది.

aap-political-advertisements-delhi-lg
aap-political-advertisements-delhi-lg

దేశ రాజధాని దిల్లీలో ఆప్‌ సర్కారుకు, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాకు మధ్య విభేదాలు మరోసారి వార్తల్లోకెక్కాయి! ప్రభుత్వ ప్రకటనలను పార్టీ సొంత ప్రచారం కోసం వాడుకున్నారంటూ.. వాటికి సంబంధించి రూ.97 కోట్లు చెల్లించాలని ఆప్‌ను ఆయన తాజాగా ఆదేశించారు. దిల్లీ ప్రభుత్వ నిధుల నుంచి ఖర్చు చేసిన ఈ మొత్తాన్ని పార్టీ నుంచి వసూలు చేయాలని చీఫ్ సెక్రెటరీకి సూచించారు.

ప్రభుత్వ ప్రకటనలపై 2016లో ఏర్పాటు చేసిన కమిటీ మార్గదర్శకాలతో పాటు సుప్రీం కోర్టు, దిల్లీ హైకోర్టులు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించారన్న కారణాలపై వీకే సక్సేనా ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధించిన కొద్ది రోజుల వ్యవధిలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

మరోవైపు.. ఎల్‌జీ ఆదేశాలపై ఆప్‌ స్పందించింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు అటువంటి ఆదేశాలు ఇచ్చే అధికారం లేదని పేర్కొంది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లోనూ ప్రకటనలు ఇస్తుందని.. అయితే, కేవలం ఆప్‌ ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. దిల్లీ ప్రజలను ఇబ్బంది పెట్టేందుకే భాజపా ఈ విధంగా వ్యవహరిస్తోందన్నారు.

దిల్లీలో ప్రభుత్వ విధానాలు, పాలనాపర విషయాలు, పథకాల విషయంలో రాష్ట్ర సర్కారుకు, లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. మద్యం విధానం, ఉచిత విద్యుత్‌ పథకం తదితర పథకాల్లో అక్రమాలపై విచారణకు ఎల్జీ గతంలో ఆదేశించారు. మరోవైపు.. ఆప్‌ నేతలూ వీకే సక్సేనాపై అవినీతి ఆరోపణలు చేశారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో పాత నోట్ల మార్పిడి, తన కుమార్తెకు టెండర్‌ను కేటాయించడం వంటి విషయాల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.

దేశ రాజధాని దిల్లీలో ఆప్‌ సర్కారుకు, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాకు మధ్య విభేదాలు మరోసారి వార్తల్లోకెక్కాయి! ప్రభుత్వ ప్రకటనలను పార్టీ సొంత ప్రచారం కోసం వాడుకున్నారంటూ.. వాటికి సంబంధించి రూ.97 కోట్లు చెల్లించాలని ఆప్‌ను ఆయన తాజాగా ఆదేశించారు. దిల్లీ ప్రభుత్వ నిధుల నుంచి ఖర్చు చేసిన ఈ మొత్తాన్ని పార్టీ నుంచి వసూలు చేయాలని చీఫ్ సెక్రెటరీకి సూచించారు.

ప్రభుత్వ ప్రకటనలపై 2016లో ఏర్పాటు చేసిన కమిటీ మార్గదర్శకాలతో పాటు సుప్రీం కోర్టు, దిల్లీ హైకోర్టులు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించారన్న కారణాలపై వీకే సక్సేనా ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధించిన కొద్ది రోజుల వ్యవధిలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

మరోవైపు.. ఎల్‌జీ ఆదేశాలపై ఆప్‌ స్పందించింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు అటువంటి ఆదేశాలు ఇచ్చే అధికారం లేదని పేర్కొంది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లోనూ ప్రకటనలు ఇస్తుందని.. అయితే, కేవలం ఆప్‌ ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. దిల్లీ ప్రజలను ఇబ్బంది పెట్టేందుకే భాజపా ఈ విధంగా వ్యవహరిస్తోందన్నారు.

దిల్లీలో ప్రభుత్వ విధానాలు, పాలనాపర విషయాలు, పథకాల విషయంలో రాష్ట్ర సర్కారుకు, లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. మద్యం విధానం, ఉచిత విద్యుత్‌ పథకం తదితర పథకాల్లో అక్రమాలపై విచారణకు ఎల్జీ గతంలో ఆదేశించారు. మరోవైపు.. ఆప్‌ నేతలూ వీకే సక్సేనాపై అవినీతి ఆరోపణలు చేశారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో పాత నోట్ల మార్పిడి, తన కుమార్తెకు టెండర్‌ను కేటాయించడం వంటి విషయాల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.