కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధరణ అయిన 24 ఏళ్ల శివానంద్ అనే వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కబల్లాపుర్ జిల్లాలో జరిగింది.

ఏప్రిల్ 20న కరోనా పరీక్షలు చేసుకున్న శివానంద్కు పాజిటివ్గా తేలింది. అతడిని చికిత్స తీసుకోమని వైద్యులు సూచించారు. అప్పటి నుంచి అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. చివరకు... గౌరీబిదనూరులో ఓ చెట్టుకు అతడి మృతదేహం వేలాడుతూ కనిపించింది.
బైకు దొంగతనం కేసులో శివానంద్.. గతంలో రెండు సార్లు జైలుకు వెళ్లినట్లు సమాచారం.
ఇదీ చూడండి: పాజిటివిటీ 10% దాటిన రాష్ట్రాల్లో మినీ లాక్డౌన్లు