ETV Bharat / bharat

విభజన గాయాలు గుర్తు చేసుకున్న రీనా వర్మ.. 75 ఏళ్ల తర్వాత పాకిస్థాన్​కు..

Reena Varma Rawalpindi: 1947 దేశవిభజన సమయంలో పాకిస్థాన్​ నుంచి ఇండియా వచ్చేసిన ఓ బామ్మ కోరిక నెరవేరనుంది. పుణెలో నివసిస్తున్న రీనా వర్మ సుమారు 75 ఏళ్ల తర్వాత పాకిస్థాన్​కు బయలుదేరారు. ఈ సందర్భంగా దేశ విభజన గాయాలు గుర్తుచేసుకున్నారు భారతీయ వనిత.

author img

By

Published : Jul 17, 2022, 10:46 AM IST

Reena Varma Rawalpindi
Reena Varma Rawalpindi

Reena Varma Rawalpindi: పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఉన్న తన పూర్వీకుల ఇల్లు 'ప్రేమ్‌ నివాస్‌' చూడాలన్న 90 ఏళ్ల రీనా ఛిబ్బర్‌ వర్మ కల 75 ఏళ్ల తర్వాత నెరవేరుతోంది. పాక్‌ అధికారులు ఆమెకు వీసా మంజూరు చేయడం వల్ల వాఘా- అటారీ సరిహద్దు గుండా శనివారం ఆమె రావల్పిండికి చేరుకున్నారు. దేశ విభజన సమయంలో పదిహేనేళ్ల ప్రాయాన ఈ ప్రాంతం వీడి వెళ్లిన రీనా ఇక్కడకు రాగానే పాక్​కు బయల్దేరారు.

మహారాష్ట్రలోని పుణెలో ఇంతకాలం నివసించిన ఈమె రావల్పిండితో తన అనుబంధాన్ని పంచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పెట్టారు. విభజనకు ముందు హిందూ, ముస్లిం తేడాల్లేకుండా తామంతా కలిసి మెలిసి ఉండేవారమని అందులో పేర్కొన్నారు. పాక్‌ వీసా కోసం తాను పలుమార్లు ప్రయత్నం చేసి విఫలమైనట్లు తెలిపారు. ఈ వీడియో చూసిన పాక్‌ పౌరుడు సజ్జాద్‌ హైదర్‌.. రీనాతో మాట్లాడి, రావల్పిండిలోని ఆమె పూర్వీకుల ఇంటి చిత్రాలు పంపారు. భారత్‌లోని పాకిస్థాన్‌ హైకమిషన్‌ సద్భావన చర్య కింద ఈమెకు మూడు నెలల వీసా మంజూరు చేసింది. దీంతో పాక్‌ చేరుకున్న రీనా ఇక్కడ గడిపిన తన బాల్యాన్ని, చదివిన పాఠశాలను, స్నేహితులను గుర్తు చేసుకున్నారు.

ఇవీ చదవండి:

Reena Varma Rawalpindi: పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఉన్న తన పూర్వీకుల ఇల్లు 'ప్రేమ్‌ నివాస్‌' చూడాలన్న 90 ఏళ్ల రీనా ఛిబ్బర్‌ వర్మ కల 75 ఏళ్ల తర్వాత నెరవేరుతోంది. పాక్‌ అధికారులు ఆమెకు వీసా మంజూరు చేయడం వల్ల వాఘా- అటారీ సరిహద్దు గుండా శనివారం ఆమె రావల్పిండికి చేరుకున్నారు. దేశ విభజన సమయంలో పదిహేనేళ్ల ప్రాయాన ఈ ప్రాంతం వీడి వెళ్లిన రీనా ఇక్కడకు రాగానే పాక్​కు బయల్దేరారు.

మహారాష్ట్రలోని పుణెలో ఇంతకాలం నివసించిన ఈమె రావల్పిండితో తన అనుబంధాన్ని పంచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పెట్టారు. విభజనకు ముందు హిందూ, ముస్లిం తేడాల్లేకుండా తామంతా కలిసి మెలిసి ఉండేవారమని అందులో పేర్కొన్నారు. పాక్‌ వీసా కోసం తాను పలుమార్లు ప్రయత్నం చేసి విఫలమైనట్లు తెలిపారు. ఈ వీడియో చూసిన పాక్‌ పౌరుడు సజ్జాద్‌ హైదర్‌.. రీనాతో మాట్లాడి, రావల్పిండిలోని ఆమె పూర్వీకుల ఇంటి చిత్రాలు పంపారు. భారత్‌లోని పాకిస్థాన్‌ హైకమిషన్‌ సద్భావన చర్య కింద ఈమెకు మూడు నెలల వీసా మంజూరు చేసింది. దీంతో పాక్‌ చేరుకున్న రీనా ఇక్కడ గడిపిన తన బాల్యాన్ని, చదివిన పాఠశాలను, స్నేహితులను గుర్తు చేసుకున్నారు.

ఇవీ చదవండి:

హడావుడిగా పాక్​లో ల్యాండైన భారత విమానం.. హైదరాబాద్​కు​ వస్తుండగా!

శరవేగంగా అయోధ్య రామాలయ నిర్మాణం.. ముస్లింలు సైతం భాగమై..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.