ETV Bharat / bharat

తౌక్టే విలయం: ఆ నౌకలో 34 మంది మృతి

author img

By

Published : May 19, 2021, 11:02 AM IST

Updated : May 19, 2021, 1:36 PM IST

తౌక్టే తుపాను ధాటికి గల్లంతైన నౌకల్లోని 618 మందిని రక్షించింది నేవీ. ముంబయిలో పీ-305 నౌక కొట్టుకుపోయిన ఘటనలో ఇప్పటివరకు 184 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. నౌకలో చిక్కుకుని 34 మంది మరణించినట్లు పేర్కొన్నారు.

89 from P305 missing
184 మందిని రక్షించిన నేవీ అధికారులు

తౌక్టే తుపాను కారణంగా ముంబయిలో రెండు నౌకలు కొట్టుకుపోయిన ఘటనలో పీ-305 నౌకలో ఉన్న మొత్తం 273 మందిలో ఇప్పటివరకు 184 మందిని రక్షించినట్లు నౌకాదళ అధికారులు తెలిపారు. పీ- 305 నౌకలో చిక్కుకుని 34 మంది మృతి చెందారని పేర్కొన్నారు. 16 మృతదేహాలు లభ్యమైనట్లు చెప్పారు.

యుద్ధనౌకలు రంగంలోకి..

ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్​ఎస్ కోల్​కతా ద్వారా పీ 305 నుంచి 184 మందిని సురక్షితంగా తీసుకొచ్చినట్లు తెలిపారు. ఐఎన్​ఎస్ తేజ్, ఐఎన్​ఎస్ బెట్వా, ఐఎన్​ఎస్ బియాస్ యుద్ధ నౌకలతో పాటు పీ8ఐ యుద్ధవిమానాన్ని రంగంలోకి దింపినట్లు పేర్కొన్నారు.

navy rescue
కొనసాగుతున్న సహాయక చర్యలు
navy rescue
బాధితులను తరలిస్తున్న సిబ్బంది

తౌక్టే తుపాను కారణంగా సముద్రంలో మూడు నౌకలు, ఒక ఆయిల్ రిగ్​లో మొత్తం 707 మంది చిక్కుకున్నారని అధికారులు వివరించారు. పీ-305లో 273, కార్గో నౌకలో 137, ఎస్​ఎస్-3 నౌకలో 196, సాగర్​ భూషన్​ ఆయిల్​ రిగ్​లో 101 మంది ఉన్నట్లు పేర్కొన్నారు.

navy rescue
కొనసాగుతున్న సహాయక చర్యలు
navy rescue
సహాయక చర్యలు ముమ్మరం

అయితే వీరిలో ఎస్ఎస్​-3నౌకలో ఉన్న 196 మందిని, జీఏఎల్ కన్స్​ట్రక్టర్​ నౌకలో 137, సాగర్​ భూషన్​ ఆయిల్​ రిగ్​లోని 101 మంది మంగళవారం రక్షించినట్లు తెలిపారు.

కన్నీటి పర్యంతం

నౌక నుంచి బయటపడ్డాక కన్నీటి పర్యంతం

పీ 305 నౌక నుంచి సురక్షితంగా బయటకు వచ్చిన తర్వాత అందులోని ఓ వ్యక్తి నౌకాదళం సహాయక చర్యలపై మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు.

ఇదీ చదవండి : కొవిడ్ మారణహోమం- ఒక్కరోజే 4,529మంది మృతి

తౌక్టే తుపాను కారణంగా ముంబయిలో రెండు నౌకలు కొట్టుకుపోయిన ఘటనలో పీ-305 నౌకలో ఉన్న మొత్తం 273 మందిలో ఇప్పటివరకు 184 మందిని రక్షించినట్లు నౌకాదళ అధికారులు తెలిపారు. పీ- 305 నౌకలో చిక్కుకుని 34 మంది మృతి చెందారని పేర్కొన్నారు. 16 మృతదేహాలు లభ్యమైనట్లు చెప్పారు.

యుద్ధనౌకలు రంగంలోకి..

ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్​ఎస్ కోల్​కతా ద్వారా పీ 305 నుంచి 184 మందిని సురక్షితంగా తీసుకొచ్చినట్లు తెలిపారు. ఐఎన్​ఎస్ తేజ్, ఐఎన్​ఎస్ బెట్వా, ఐఎన్​ఎస్ బియాస్ యుద్ధ నౌకలతో పాటు పీ8ఐ యుద్ధవిమానాన్ని రంగంలోకి దింపినట్లు పేర్కొన్నారు.

navy rescue
కొనసాగుతున్న సహాయక చర్యలు
navy rescue
బాధితులను తరలిస్తున్న సిబ్బంది

తౌక్టే తుపాను కారణంగా సముద్రంలో మూడు నౌకలు, ఒక ఆయిల్ రిగ్​లో మొత్తం 707 మంది చిక్కుకున్నారని అధికారులు వివరించారు. పీ-305లో 273, కార్గో నౌకలో 137, ఎస్​ఎస్-3 నౌకలో 196, సాగర్​ భూషన్​ ఆయిల్​ రిగ్​లో 101 మంది ఉన్నట్లు పేర్కొన్నారు.

navy rescue
కొనసాగుతున్న సహాయక చర్యలు
navy rescue
సహాయక చర్యలు ముమ్మరం

అయితే వీరిలో ఎస్ఎస్​-3నౌకలో ఉన్న 196 మందిని, జీఏఎల్ కన్స్​ట్రక్టర్​ నౌకలో 137, సాగర్​ భూషన్​ ఆయిల్​ రిగ్​లోని 101 మంది మంగళవారం రక్షించినట్లు తెలిపారు.

కన్నీటి పర్యంతం

నౌక నుంచి బయటపడ్డాక కన్నీటి పర్యంతం

పీ 305 నౌక నుంచి సురక్షితంగా బయటకు వచ్చిన తర్వాత అందులోని ఓ వ్యక్తి నౌకాదళం సహాయక చర్యలపై మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు.

ఇదీ చదవండి : కొవిడ్ మారణహోమం- ఒక్కరోజే 4,529మంది మృతి

Last Updated : May 19, 2021, 1:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.