కర్ణాటకలో దారుణం జరిగింది. బెళగావిలోని ముదలగి బస్టాండ్ సమీపంలోని వంతెన వద్ద గల మురికి కాల్వలో ఏడు పిండాలు కనిపించాయి. వీటిని డబ్బాల్లో పెట్టి కాలువలో పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ పిండాల్ని చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వీటిని అక్కడ ఎవరు వేశారో ఇంకా తెలియలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
"ముదలగి పట్టణ వంతెన వద్ద ఐదు డబ్బాల్లో ఏడు పిండాలు లభ్యమయ్యాయి. ఈ పిండాలన్నీ అయిదు నెలల వయసు ఉన్నవే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నాక పిండాలను బెళగావిలోని సైన్స్ ప్రయోగశాలకు పంపుతాం. ఈ హత్యలకు గల కారణాన్ని అన్వేషించేందుకు పోలీసులు ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే స్థానిక ఆసుపత్రికి పిండాలను తరలించాం. ఈ ఘటన గురించి జిల్లా కలెక్టర్కు సమాచారం అందిస్తాం."
- మహేష్ కొహ్ని, జిల్లా ఆరోగ్య అధికారి
ఇవీ చదవండి: కృష్ణుడి విగ్రహం మింగేసిన భక్తుడు.. డాక్టర్ల శ్రమతో లక్కీగా..