ETV Bharat / bharat

10 రోజులుగా అంధకారంలోనే ఆ 60 గ్రామాలు! - విద్యుత్​ లేని గ్రామాలు

మహారాష్ట్ర నాశిక్​ జిల్లాలోని 60 గ్రామాలు.. పది రోజులుగా అంధకారంలో మునిగిపోయాయి. విద్యుత్​ లేకపోవడం వల్ల రాత్రిళ్లు క్రూరమృగాలు తమపై దాడి చేస్తున్నాయని అక్కడి జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమ ఊళ్లకు మళ్లీ విద్యుత్​ సరఫరా కొనసాగించాల్సిందిగా కోరుతున్నారు.

without electricity
10 రోజులుగా అంధకారంలోనే ఆ 60 గ్రామాలు!
author img

By

Published : Apr 7, 2021, 11:58 AM IST

Updated : Apr 7, 2021, 12:21 PM IST

ఈ రోజుల్లో.. ఇంట్లో కొంతసేపు కరెంట్​ లేకపోయినా.. ఎంతో ఇబ్బందిగా భావిస్తుంటాము. అలాంటిది.. మహారాష్ట్ర నాశిక్​​ జిల్లా త్రయంబకేశ్వర్​ మండలంలోని 60 గ్రామాల ప్రజలు.. పది రోజులుగా చీకట్లోనే ఉంటున్నారు. ముఖ్యంగా.. రాత్రిళ్లు విద్యుత్​ లేకపోవడం వల్ల.. అటవీ జంతువులు దాడులు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"ఈ ప్రాంతంలోని 60 గ్రామాల్లో 8 నుంచి 10 రోజులుగా విద్యుత్​ సరఫరా లేదు. దీంతో గ్రామస్థులంతా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాత్రిళ్లు చీకటిగా ఉండటం వల్ల అడవి జంతువులు మాపై దాడులు చేస్తున్నాయి. అధికారులు వెంటనే విద్యుత్​ను పునరుద్ధరించాలని మేం వేడుకుంటున్నాం."

- సంజయ్​ గంగోడే, బెల్గోడగా గ్రామ సర్పంచ్​

బిల్లు చెల్లించనందునే!

"జిల్లా అధికారులు విద్యుత్​ బిల్లులను చెల్లించనందునే మా గ్రామాలకు విద్యుత్​ సరఫరాను నిలిపివేశార"ని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తెలిపారు.

ఈ గ్రామాలన్నీ దట్టమైన అటవీ ప్రాంతాల మధ్య ఉన్నాయి. దాంతో చిరుత పులులు వంటి జంతువులు రాత్రిళ్లు గ్రామంలోకి ప్రవేశించి దాడులు చేస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: రైల్వే గోడలపై మేవాడ్​ ఘన చరిత్ర.. చూస్తే వావ్​!

ఈ రోజుల్లో.. ఇంట్లో కొంతసేపు కరెంట్​ లేకపోయినా.. ఎంతో ఇబ్బందిగా భావిస్తుంటాము. అలాంటిది.. మహారాష్ట్ర నాశిక్​​ జిల్లా త్రయంబకేశ్వర్​ మండలంలోని 60 గ్రామాల ప్రజలు.. పది రోజులుగా చీకట్లోనే ఉంటున్నారు. ముఖ్యంగా.. రాత్రిళ్లు విద్యుత్​ లేకపోవడం వల్ల.. అటవీ జంతువులు దాడులు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"ఈ ప్రాంతంలోని 60 గ్రామాల్లో 8 నుంచి 10 రోజులుగా విద్యుత్​ సరఫరా లేదు. దీంతో గ్రామస్థులంతా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాత్రిళ్లు చీకటిగా ఉండటం వల్ల అడవి జంతువులు మాపై దాడులు చేస్తున్నాయి. అధికారులు వెంటనే విద్యుత్​ను పునరుద్ధరించాలని మేం వేడుకుంటున్నాం."

- సంజయ్​ గంగోడే, బెల్గోడగా గ్రామ సర్పంచ్​

బిల్లు చెల్లించనందునే!

"జిల్లా అధికారులు విద్యుత్​ బిల్లులను చెల్లించనందునే మా గ్రామాలకు విద్యుత్​ సరఫరాను నిలిపివేశార"ని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తెలిపారు.

ఈ గ్రామాలన్నీ దట్టమైన అటవీ ప్రాంతాల మధ్య ఉన్నాయి. దాంతో చిరుత పులులు వంటి జంతువులు రాత్రిళ్లు గ్రామంలోకి ప్రవేశించి దాడులు చేస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: రైల్వే గోడలపై మేవాడ్​ ఘన చరిత్ర.. చూస్తే వావ్​!

Last Updated : Apr 7, 2021, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.