ETV Bharat / bharat

'దేశవ్యాప్తంగా కొవిడ్​ ఆస్పత్రుల్లో 4.68 లక్షల పడకలు'

దేశంలో కరోనా రోగుల కోసం ఆస్పత్రుల్లో 4.68 లక్షల పడకలను ఏర్పాటు చేసినట్లు సుప్రీం కోర్టుకు తెలిపింది కేంద్రం. కొవిడ్​ నియంత్రణ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు పేర్కొంది. వైరస్​ను సమర్థంగా ఎదుర్కొనేందుకు.. భారీగా వైద్య మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

author img

By

Published : May 3, 2021, 10:35 PM IST

Supreme court
సుప్రీం కోర్టు

దేశవ్యాప్తంగా కొవిడ్​ రోగుల కోసం 2,084 ఆస్పత్రుల్లో 4.68 లక్షల పడకలను ఏర్పాటు చేసినట్లు సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. కరోనా రెండో దశ విజృంభణ వేళ రోగులకు అందుబాటులో ఉన్న పడకలు సహా వైరస్​ను ఎదుర్కోవటానికి అవసరమైన సామగ్రి, సేవల లభ్యతపై జస్టిస్​ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని ధర్మాసనం వివరణ కోరగా.. ఈ మేరకు అఫిడవిట్​ సమర్పించింది కేంద్రం.

భారీ ఏర్పాట్లు

కరోనా నియంత్రణకు భారీ ఏర్పాట్లు చేసినట్లు కోర్టుకు తెలిపింది కేంద్రం. దీనిలో భాగంగా కొవిడ్ కేర్ సెంటర్లు(12,673), డెడికేటెడ్​ కొవిడ్​ హెల్త్​ సెంటర్లు(4,043), డెడికేటెడ్​ కొవిడ్​ ఆస్పత్రులు(డీసీహెచ్​) ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. 2,084 డీసీహెచ్​లు ఉండగా.. అందులో 89 కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో.. మిగిలిన 1,995 రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని తెలిపింది. దేశంలో మొత్తం 18,52,265 పడకలు ఉండగా.. అందులో డీసీహెచ్​ల్లో 4,68,974 పడకలు ఉన్నాయని వివరణ ఇచ్చింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రులను కూడా డీసీహెచ్​లుగా మార్చినట్లు పేర్కొంది.

'వైద్య సిబ్బందిని పెంచుకోండి'

జస్టిస్​ ఎల్​ నాగేశ్వరరావు, జస్టిస్​ ఎస్​ రవీంద్ర భట్​లతో కూడిన ధర్మాసనం.. ఈ విపత్కర పరిస్థితుల్లో వైద్య సిబ్బందిని మరింత పెంచుకోవచ్చని కేంద్రానికి సిపార్సు చేసింది. అలాగే సాయుధ, పారామిలటరీలోని వైద్య సిబ్బందిని వ్యాక్సినేషన్​ ప్రక్రియకు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఇదీ చూడండి: మహారాష్ట్రలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కొవిడ్​ రోగుల కోసం 2,084 ఆస్పత్రుల్లో 4.68 లక్షల పడకలను ఏర్పాటు చేసినట్లు సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. కరోనా రెండో దశ విజృంభణ వేళ రోగులకు అందుబాటులో ఉన్న పడకలు సహా వైరస్​ను ఎదుర్కోవటానికి అవసరమైన సామగ్రి, సేవల లభ్యతపై జస్టిస్​ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని ధర్మాసనం వివరణ కోరగా.. ఈ మేరకు అఫిడవిట్​ సమర్పించింది కేంద్రం.

భారీ ఏర్పాట్లు

కరోనా నియంత్రణకు భారీ ఏర్పాట్లు చేసినట్లు కోర్టుకు తెలిపింది కేంద్రం. దీనిలో భాగంగా కొవిడ్ కేర్ సెంటర్లు(12,673), డెడికేటెడ్​ కొవిడ్​ హెల్త్​ సెంటర్లు(4,043), డెడికేటెడ్​ కొవిడ్​ ఆస్పత్రులు(డీసీహెచ్​) ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. 2,084 డీసీహెచ్​లు ఉండగా.. అందులో 89 కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో.. మిగిలిన 1,995 రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని తెలిపింది. దేశంలో మొత్తం 18,52,265 పడకలు ఉండగా.. అందులో డీసీహెచ్​ల్లో 4,68,974 పడకలు ఉన్నాయని వివరణ ఇచ్చింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రులను కూడా డీసీహెచ్​లుగా మార్చినట్లు పేర్కొంది.

'వైద్య సిబ్బందిని పెంచుకోండి'

జస్టిస్​ ఎల్​ నాగేశ్వరరావు, జస్టిస్​ ఎస్​ రవీంద్ర భట్​లతో కూడిన ధర్మాసనం.. ఈ విపత్కర పరిస్థితుల్లో వైద్య సిబ్బందిని మరింత పెంచుకోవచ్చని కేంద్రానికి సిపార్సు చేసింది. అలాగే సాయుధ, పారామిలటరీలోని వైద్య సిబ్బందిని వ్యాక్సినేషన్​ ప్రక్రియకు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఇదీ చూడండి: మహారాష్ట్రలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.