కేరళలో కరోనా విజృంభణ- కొత్తగా 22వేల కేసులు - కొవిడ్ కేసులు తాజా
కరోనా, జికా వైరస్ల విజృంభణతో కేరళలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో కొత్తగా 22వేల కరోనా కేసులు నమోదు కాగా మరో 5 మందికి జికా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం జికా కేసుల సంఖ్య 56కి చేరింది.

కేరళలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. కొత్తగా రాష్ట్రంలో 22,129 మందికి కరోనా సోకగా.. 13,145 మంది కోలుకున్నారు. 156 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది.
రాష్ట్రంలో కేసుల వివరాలు..
మొత్తం కేసులు : 33,05,245
కోలుకున్నవారు : 31,43,043
మృతుల సంఖ్య : 16,326
యాక్టివ్ కేసులు : 1,45,371
అత్యధికంగా మలప్పురం జిల్లాలో 4,037 కేసులు నమోదయ్యాయి. త్రిసూర్ (2,623), కోజికోడ్ (2,397), ఎర్నాకులం (2,352), పాలక్కడ్ (2,115) ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.
చాపకింద నీరులా జికా..
మరోవైపు జికా వైరస్ రాష్ట్రంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కొత్తగా మరో ఐదుగురికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో మొత్తం జికా కేసుల సంఖ్య 56కి చేరింది.
ఇదీ చదవండి : పెద్దలకు మాత్రమే.. అస్సలు మిస్ కావద్దు