ETV Bharat / bharat

మే 26 నిరసనలకు విపక్షాల మద్దతు

author img

By

Published : May 23, 2021, 7:00 PM IST

Updated : May 23, 2021, 7:28 PM IST

మే 26న బ్లాక్​ డే పేరిట సంయుక్త కిసాన్ మోర్చా తలపెట్టిన నిరసనలకు విపక్షాలు మద్దతు ప్రకటించాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమానికి 6 నెలలు పూర్తికానున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది ఎస్​కేఎం.

12 opposition parties extend support to SKM protest cal on May 26
మే 26 బ్లాక్​ డేకు మద్దతు ప్రకటించిన ప్రతిపక్షాలు

మే 26న సంయుక్త కిసాన్ మోర్చా తలపెట్టిన దేశవ్యాప్త నిరసనలకు 12 విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన రైతు ఉద్యమం 6 నెలలు పూర్తి కావొస్తున్న సందర్భంగా మే 26న 'బ్లాక్ డే' పాటించాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) ఇటీవల పిలుపునిచ్చింది. కాంగ్రెస్, జేడీఎస్, ఎన్​సీపీ, టీఎంసీ, శివసేన, డీఎంకే, ఎస్​పీ, వామపక్షాలు సహా ఇతర ప్రధాన పార్టీలు ఇందుకు మద్దతు తెలిపాయి.

ప్రభుత్వం రైతులను వెంటనే చర్చలకు ఆహ్వానించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం.. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించాలని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి.

మే 26న సంయుక్త కిసాన్ మోర్చా తలపెట్టిన దేశవ్యాప్త నిరసనలకు 12 విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన రైతు ఉద్యమం 6 నెలలు పూర్తి కావొస్తున్న సందర్భంగా మే 26న 'బ్లాక్ డే' పాటించాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) ఇటీవల పిలుపునిచ్చింది. కాంగ్రెస్, జేడీఎస్, ఎన్​సీపీ, టీఎంసీ, శివసేన, డీఎంకే, ఎస్​పీ, వామపక్షాలు సహా ఇతర ప్రధాన పార్టీలు ఇందుకు మద్దతు తెలిపాయి.

ప్రభుత్వం రైతులను వెంటనే చర్చలకు ఆహ్వానించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం.. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించాలని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి.

ఇవీ చదవండి: 'మా సహనాన్ని పరీక్షించొద్దు.. చర్చలు జరపండి'

మే 26న బ్లాక్ డే- 'ఇంటి నుంచే నిరసన'కు పిలుపు

Last Updated : May 23, 2021, 7:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.