thumbnail

By

Published : Oct 8, 2022, 1:12 PM IST

ETV Bharat / Videos

'ఐలవ్​యూ' చెప్పాడని చితకబాదిన యువతి.. డ్రైనేజీ గొడవలో మహిళ గొంతు కోసి పరార్​!

రాజస్థాన్​లోన్ జోధ్​పుర్​లో ఐలవ్​యూ చెప్పిన వ్యక్తిని చితకబాదింది ఓ యువతి. స్కూటీపై యువతి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఓ వ్యక్తి ఆమెను ఆపాడు. కోపంతో ఆమె దుర్భాషలాడగా.. అతడు వెంటనే ఐలవ్​​యూ చెప్పాడు. ఆ మాట విన్న యువతి అతడ్ని చితకబాదింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. మరోవైపు, బిహార్​లోని వైశాలిలో ఓ దారుణం జరిగింది. మోహియుద్దీన్‌పూర్ గరాహి పంచాయతీలో డ్రైనేజీ సమస్యపై ఓ మహిళ, ఆమె పొరిగింటి వ్యక్తికి మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఆ వ్యక్తి కత్తితో ఆమె గొంతు కోశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగుల్లో ఉన్న ఆ మహిళను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.