thumbnail

కోతులను చెట్టుకు వేలాడదీసిన దుండగులు.. రెండు వానరాలు మృతి

By

Published : Sep 29, 2022, 9:27 PM IST

కర్ణాటకలోని బీదర్​లో నాలుగు కోతులను చింతపండు చెట్టుకు వేలాడదీశారు దుండగులు. అయితే వాటిలో రెండు వానరాలు మరణించగా.. మరో రెండు కోతులు తప్పించుకుని పారిపోయాయి. ఈ దుశ్యర్యకు పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని భజరంగ్​ దళ్, విశ్వహిందూ పరిషత్​ కార్యకర్తలు, స్థానికులు డిమాండ్​ చేశారు. చనిపోయిన కోతుల మృతదేహాలకు యువకులు అంత్యక్రియలు నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.