మొన్నటివరకూ ఎండిన వృక్షాలతో కళావిహీనంగా ఉన్న కొండలు ఇప్పుడు పచ్చదనంతో అలరారుతున్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరులో కొండలు పచ్చదనం పరుచుకుని ఆహ్లాదకరంగా మారాయి. చిగురిస్తున్న చెట్లు.. మధ్యలో పచ్చదనంతో గిరులు.. వాటిపై తెలుపు, నలుపు వర్ణంలో మేఘాలు.. వావ్.. అనిపిస్తున్నాయి. ఆ ఆనందాన్ని.. ప్రకృతి సౌందర్యాన్ని మనమూ ఆస్వాదిద్దాం.