thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 14, 2023, 10:13 PM IST

ETV Bharat / Videos

రేషన్​ బియ్యం పంపిణీ నిలిపేశారని గ్రామపంచాయతీకి తాళం వేసి మహిళల నిరసన

Women Protest Against on Ration Rice not Supplied: తమకు రేషన్​ బియ్యం అందడం లేదని అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో మహిళలు నిరసనకు దిగారు. తమకు రేషన్​ డీలర్​ బియ్యం అందించడం లేదని గ్రామపంచాయతి కార్యాలయానికి తాళం వేసి ఆందోళన వ్యక్తం చేశారు. సచివాలయం ముందు బైఠాయించగా విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకోగా.. గ్రామస్థులు, సిబ్బందికి మధ్య వివాదం చెలరేగింది.

కంబదూరు మండలం మర్రిమాకులపల్లి గ్రామంలోని మహిళలు.. రేషన్​ బియ్యం అందడం లేదని అందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మండల రెవెన్యూ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. సమస్యపై ఆరా తీయగా.. తమకు మూడు నెలలుగా డీలర్​ రేషన్​ పంపిణీ చేయడం లేదని.. తాము ఏం తినాలని అధికారులను నిలదీశారు. ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే దౌర్జన్యానికి దిగుతున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలో మహిళలు, రెవెన్యూ అధికారులకు మధ్య చిన్న వివాదం చెలరేగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రేషన్​ అందించాలని అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.