Villagers Agitation At Power Substation : విద్యుత్ కోతలపై గ్రామస్తులు ఆగ్రహం.. సబ్ స్టేషన్ ముట్టడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 30, 2023, 8:22 PM IST

thumbnail

 Villagers Agitation At Power Substation : తరచూ.. తమ గ్రామానికి విద్యుత్ కోతను విధిస్తున్నారంటూ.. అనంతపురం జిల్లా కూడేరు మండలం మరుట్ల 1 గ్రామస్థులు శుక్రవారం రాత్రి మరుట్ల 2 విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడించారు. గత పదిహేను రోజులుగా ఎలాంటి సమస్యలు లేకపోయినా ఇష్టానుసారంగా కోతలను విధిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. దీనిపై విద్యుత్ సిబ్బందిని ప్రశ్నించిన సమాధానం దాట వేస్తున్నారని తెలిపారు. కానీ మిగతా గ్రామాల్లో మాత్రం సరఫరా ఉంటుదని చెప్పారు. ఎందుకు కోతలు విధిస్తున్నారో చెప్పాలంటూ అక్కడ ఉన్న వారిని గ్రామస్థులు నిలదీశారు. చిన్న వర్షం సాయంత్రం మొదలయితే సరఫరా నిలిపి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు సరఫరా చేస్తున్నారని వాపోయారు. అదే సమయంలో పక్క గ్రామాల్లో మాత్రం సరఫరా ఉంటుందన్నారు. దీనిపై తమకు స్పష్టమైన సమాధానం చెప్పే వరకు స్టేషన్ నుంచి కదలబోమన్నారు. విద్యుత్ సిబ్బంది ఏకపక్ష ధోరణి కారణంగానే తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు. చివరకు విద్యుత్తు సరఫరా చేయడంతో వారు ఆందోళన విరమించారు. దీనిపై విద్యుత్ శాఖ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.