thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 3, 2023, 2:50 PM IST

ETV Bharat / Videos

ఒక్క ఛాన్స్ అంటూ జగన్‌ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు: కన్నా లక్ష్మీనారాయణ

TDP Kanna Lakshminarayana Fires on CM Jagan: ఒక్క ఛాన్స్ అంటూ 2019 అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సీఎం జగన్ 'వై ఏపీ నీడ్స్ జగన్' అనే కార్యక్రమంతో మారోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. రాష్ట్రానికి జగన్ ఎందుకు అవసరం లేదో సవాలక్ష కారణాలున్నాయని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఏపీ హేట్స్ జగన్ పేరిట రూపొందించిన పుస్తకాన్ని విడుదల చేశారు. 

ప్రజలకు పుస్తకంలోని విషయాలను తెలియజేస్తామని అన్నారు. మూడు రాజధానుల పేరిట, జాబ్ క్యాలెండర్ పేరిట, ప్రత్యేక హోదా సాధన పేరిట, పోలవరం రివర్స్ టెండరింగ్ పేరిట రైతుల్ని, విద్యార్థుల్ని, ప్రజల్ని వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని కన్నా మండిపడ్డారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మళ్లింపులు, దళితులపై దాడులతో రాక్షస పాలన చేస్తున్న సీఎం జగన్ రాష్ట్రానికి అవసరం లేదని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.