By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 2, 2023, 9:29 PM IST
ఆటో నడుపుతూ ఒంటరి మహిళలను బెదిరించి చోరీలు - పాపం పండింది, పోలీసులకు చిక్కారు!
Police Caught Chain Snatching Thieves in Bapatla District : బాపట్ల జిల్లా రేపల్లెలో మహిళల మెడలో బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రేపల్లె పోలీస్ సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన డీఎస్పీ మురళీ కృష్ణ మీడియాకు వివరాలు వెల్లడించారు. చెరుకుపల్లి, నిజాంపట్నం, భట్టిప్రోలు మండలాల పరిధిలో ఏడు ప్రాంతాల్లో నిందితులు చైన్ స్నాచింగ్ చేస్తున్నట్లు వివరించారు. ఆటో నడుపుతూ ఒంటరిగా ఉన్న మహిళ ప్రయాణికులను జనసమూహం లేని ప్రాంతాల వద్ద బెదిరించి బలవంతంగా బంగారు ఆభరణాలు, నగదును అపహరిస్తున్నట్లు వెల్లడించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు యుగంధర్ రెడ్డి(24), వీర నగరాజ కుమారి, శివ నాగిరెడ్డి(43), అట్ల మణికంఠ రెడ్డి (24) గా గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి సుమారు 107 గ్రాముల బంగారు ఆభరణాలు, నాలుగు వేల నగదు, ఆటో, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ మురళీ కృష్ణ తెలిపారు.