మూడు నెలలుగా రేషన్ బియ్యం నిలిపివేత - తహశీల్దార్ కార్యాలయం ఎదుట మహిళల ఆందోళన - 3 నెలలుగా బియ్యం సరఫరా నిలిపివేత
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-12-2023/640-480-20246629-thumbnail-16x9-not-distributing-ration-rice-women-protesting-of-tahsildars-office.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 12, 2023, 1:57 PM IST
Not Distributing Ration Rice Women Protesting Of Tahsildar Office: అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని 2వ గ్రామ సచివాలయం పరిధిలో మూడు నెలలుగా తమకు రేషన్ బియ్యం పంపిణీ చేయటం లేదని మహిళలు ఆందోళనకు దిగారు. సీపీఎం నాయకులతో కలసి తహశీల్దార్ కార్యాలయం ఎదుట భైఠాయించి ఆందోళన చేపట్టారు. బియ్యం అడిగితే రేషన్ కార్డులను విసిరి వేయడం, బియ్యానికి బదులు డబ్బులు తీసుకోమంటూ దుకాణదారులు ఒత్తిడి చేస్తున్నారని మహిళలు తెలిపారు. ఈ విషయంపై తహశీల్దార్ శ్రీధర్ మూర్తి, డీటీ హరిప్రసాద్లను కార్డుదారులు నిలదీశారు.
ప్రభుత్వం అందిస్తున్న బియ్యంపై ఆధారపడి ఉన్నామని లబ్ధిదారులు వెల్లడించారు. బియ్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, గంటలకొద్దీ రేషన్ బండి వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని మహిళలు అవేదన వ్యక్తం చేశారు. 3 నెలలుగా బియ్యం సరఫరా చేయకుండా నిలిపివేయటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం నిత్యావసర సరుకులు సక్రమంగా పంపిణీ చేసేదని మహిళలు గుర్తు చేశారు. సమస్యను వెంటనే పరిష్కరిస్తామని తహశీల్దార్ చెప్పడంతో వారు శాంతించారు.